
అవినీతిపై విచారణ చేపట్టాలి
మహబూబాబాద్: గార్ల మండలం మద్దివంచ గ్రామంలో ఉపాధి హామీ పథకంలో జరిగిన అవినీతిపై విచారణ చేపట్టాలని, కూలీలకు న్యాయం చేయాలని సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు కట్టెబోయిన శ్రీనివాస్ డిమాండ్ చేశారు. మద్దివంచ గ్రామానికి చెందిన ఉపాధి హామీ కూలీలు సోమవారం కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేసి కార్యాలయంలో వినతిప్రతం అందజేశారు. ఈసందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఆ గ్రామంలో ఏపీఓ, ఎఫ్ఏ, కంప్యూటర్ ఆపరేటర్లు కలిసి బినామీ పేర్లతో కూలీల డబ్బులు కాజేశారని, వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సుమారు రెండు నెలల పాటు 200మంది కూలీలు డబ్బులు సుమారు రూ.8 లక్షలు మాయం చేశారని, వెంటనే విచారణ చేసి డబ్బులు వారి ఖాతాల్లోజమ చేయాలన్నారు. ఎంపీడీఓ, సంబంధిత కార్యాలయాల ఎదుట ఆందోళన చేసినా ఫలితం లేకపోవడంతో కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేశామన్నారు. కూలీలకు న్యాయం చేయకపోతే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు మల్లేష్, రమేశ్, బాబురావు, లోకేష్, నాగేశ్వర్, కూలీలు వినోద, బుచ్చమ్మ తదితరులు పాల్గొన్నారు.