ప్రాణాల మీదికి తెచ్చుకోవద్దు | - | Sakshi
Sakshi News home page

ప్రాణాల మీదికి తెచ్చుకోవద్దు

Jun 24 2025 3:33 AM | Updated on Jun 24 2025 3:33 AM

ప్రాణాల మీదికి తెచ్చుకోవద్దు

ప్రాణాల మీదికి తెచ్చుకోవద్దు

హన్మకొండ : విద్యుత్‌ ఉద్యోగుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు టీజీ ఎన్పీడీసీఎల్‌ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ కర్నాటి వరుణ్‌ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం నక్కలగుట్టలోని టీజీ ఎన్పీడీసీఎల్‌ హనుమకొండ సర్కిల్‌ కార్యాలయంలో నిర్మించిన విద్యుత్‌ ఉద్యోగ అమరుల స్మృతి చిహ్నాన్ని సీఎండీ వరుణ్‌ రెడ్డి ఆవిష్కరించారు. సీ ఎండీతో పాటు డైరెక్టర్లు, అధికారులు, ఉద్యోగులు పూలమాల వేసి విద్యుత్‌ అమరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీఎండీ వరుణ్‌ రెడ్డి మాట్లాడుతూ.. విద్యుత్‌ ప్రమాదకరమైనదని తెలిసి నిర్లక్ష్యంగా ఉంటూ ప్రాణాల మీదికి తెచ్చుకోవడం బా ధాకరమన్నారు. ఎల్‌సీ యాప్‌ను విధిగా వాడాలన్నారు. విద్యుత్‌ ఉద్యోగులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. విధినిర్వహణలో విద్యుత్‌ ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పుతున్న వారి జ్ఞాపకార్థం 16 సర్కిళ్లలో స్మృతి చిహ్నాలు ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. ఈ క్రమంలో ముందుగా హనుమకొండ సర్కిల్‌లో నిర్మించామని తెలిపారు. ప్రతి ఏటా విద్యుత్‌ ఉద్యోగుల సంస్మరణ దినాన్ని నిర్వహించనున్నట్లు, మృతిచెందిన ఉద్యోగులకు అందాల్సిన ప్రయోజనాలన్ని 45 రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. విద్యుత్‌ ప్రమాదాలు జరుగకుండా క్షేత్రస్థాయి వరకు ఉద్యోగులచే ప్రతిజ్ఞ చేయించాలన్నారు. కార్యక్రమంలో ఇన్‌చార్జ్‌ డైరెక్టర్లు బి.అశోక్‌ కుమార్‌, టి.సదర్‌ లాల్‌, టి.మధుసూదన్‌, వి.తిరుపతి రెడ్డి, సీఈలు కె.తిరుమల్‌ రావు, రాజు చౌహన్‌, రవీంద్రనాధ్‌, హనుమకొండ ఎస్‌ఈ పి.మధుసూదన్‌ రావు, వరంగల్‌ ఎస్‌ఈ కె.గౌతమ్‌ రెడ్డి, డీఈలు ఎ.విజేందర్‌ రెడ్డి, జి.సాంబరెడ్డి, సామ్య నాయక్‌, దర్శన్‌ కుమార్‌, భిక్షపతి, ఆనందం, హర్జి, ఎస్‌ఏఓ నవీన్‌ కుమార్‌, ట్రేడ్‌ యూనియన్‌ నాయకులు ఇనుగాల శ్రీధర్‌, కె.వి.జాన్సన్‌, మన్నె శశి కుమార్‌, అజ్మీరా శ్రీరామ్‌ నాయక్‌, బి.దానయ్య, కుమార స్వామి పాల్గొన్నారు.

సమస్యలపై సీఎండీ సానుకూల స్పందన

విద్యుత్‌ ఉద్యోగుల సమస్యలపై టీజీఎన్పీడీసీఎల్‌ చైర్మన్‌, ఎండీ కర్నాటి వరుణ్‌ రెడ్డి సానుకూలంగా స్పందించారని తెలంగాణ యునైటెడ్‌ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్‌ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నలువాల స్వామి, ఎన్పీడీసీఎల్‌ కంపెనీ అధ్యక్షుడు బొల్లి వెంకటరాజు, కార్యదర్శి ఎ.ఆంజనేయులు తెలిపారు. సోమవారం హనుమకొండలోని ప్రధాన కార్యాలయంలో వారు సీఎండీని కలిసి వినతిపత్రాన్ని అందించి సమస్యలు పరిష్కరించాలని కోరారు. తమ సమస్యలు విన్న సీఎండీ సానుకూలంగా స్పందించారని తెలిపారు. వచ్చే నెలలో విద్యుత్‌ ఉద్యోగులు, ఆర్టిజన్ల బదిలీలు ఉంటాయని చెప్పారన్నారు. టీయూఈఈయూ నాయకులు శ్రీనివాస్‌, సుదర్శన్‌ వర్మ, సంతోష్‌, కర్నాల అనిల్‌ కుమార్‌, మధుసూదనరావు పాల్గొన్నారు.

ఎల్‌సీ యాప్‌ను విధిగా వాడాలి

టీజీఎన్పీడీసీఎల్‌ సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement