
నేడు డీసీసీబీ మహాజన సభ
హన్మకొండ : వరంగల్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ) మహాజన సభ నేడు (మంగళవారం) నిర్వహిస్తున్నట్లు ఆ బ్యాంక్ ముఖ్య కార్యనిర్వహణాధికారి వజీర్ సుల్తాన్ తెలిపా రు. ఉదయం 11గంటలకు హనుమకొండ నక్కలగుట్టలోని డీసీసీబీ ప్రధాన కార్యాలయంలో చైర్మన్ మార్నేని రవీందర్ రావు అధ్యక్షతన ఈ సభ జరుగుతుందని ఆయన ఒక ప్రకటనలో వివరించారు. 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రుణాల పంపిణీ, వ్యవసాయ, విద్య రుణాల జారీ, వసూళ్లు వివిధ పథకాలపై చర్చించనున్నట్లు ఆయన వివరించారు. పూర్వ వరంగల్ జిల్లా పరిధిలోని పీఏసీఎస్ చైర్మన్లు, వ్యవసాయ శాఖ, ఉద్యానశాఖ, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొనాలని కోరారు.
విద్యావేత్తలు
రాజకీయాల్లోకి రావాలి
● ఆల్ ఇండియా ఓబీసీ జేఏసీ చైర్మన్ నరేందర్
కేయూ క్యాంపస్ : విద్యావేత్తలు రాజకీయాల్లోకి రావాలని అప్పుడే దేశంలో విలువల పాలన నిర్మితమవుతుందని ఆల్ ఇండియా ఓబీసీ జేఏసీ చైర్మన్ సాయిని నరేందర్ పేర్కొన్నారు. హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్అండ్ సైన్స్ కాలేజీలో డాక్టర్ చింతం ప్రవీణ్కుమార్ తెలుగు విభాగం అధిపతిగా సోమవారం బాధ్యతలు స్వీకరించగా, సన్మానించారు. ఓబీసీ జాక్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు తాడిశెట్టి క్రాంతికుమార్, బీసీ ఉద్యోగ సంఘాల బాధ్యులు బుసగొండ ఓంకార్, చాపర్తికుమార్, వల్లాల జగన్గౌడ్, రాసమల్ల శ్రీనివాస్, నారాయణగిరి రాజు, నలుబాల రవికుమార్, సుధాకర్ పాల్గొన్నారు.
కాజీపేట మీదుగా 8 ప్రత్యేక రైళ్లు
● నేటినుంచి ప్రారంభం
కాజీపేట రూరల్ : ప్రయాణీకుల రద్దీ దృష్ట్యా కాజీపేట జంక్షన్ మీదుగా దక్షిణ మధ్య రైల్వే, బిలాస్పూర్ రైల్వే అధికారులు కాచిగూడ–బిలాస్పూర్ మధ్య 8 ప్రత్యేక రైళ్లను నడిపిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎ.శ్రీధర్ సోమవారం తెలిపారు.
ప్రత్యేక రైళ్ల వివరాలు..
జూన్ 23 నుంచి జూలై 7వ తేదీ వరకు బిలాస్పూర్లో ప్రతి సోమవారం బయలుదేరే బిలాస్పూర్–కాచిగూడ (08263) వెళ్లే ఎక్స్ప్రెస్ మంగళవారం కాజీపేటకు చేరుకొని వెళ్తుంది. అదేవిధంగా జూన్ 24వ తేదీ నుంచి జూలై 15వ తేదీ వరకు కాచిగూడ–బిలాస్పూర్ (08264) వెళ్లే ఎక్స్ప్రెస్ ప్రతి మంగళవారం కాజీపేట జంక్షన్కు చేరుకొని వెళ్తుంది. 3 ఏసీ, స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్లతో ప్రయాణించే ఈ రైళ్ల సర్వీస్లకు బిలాస్పూర్, రాయ్పూర్, దుర్గ్, రాజ్నందగాం, డోంగ్ర, గోండియా, వడ్సా, చాంద ఫోర్ట్, బలర్షా, సిర్పూర్ కాగజ్నగర్, మంచిర్యాల, రామగుండం, కాజీపేట, చర్లపల్లి, మల్కాజ్గిరి స్టేషన్లలో హాల్టింగ్ కల్పించినట్లు సీపీఆర్వో తెలిపారు.

నేడు డీసీసీబీ మహాజన సభ