27న అప్రెంటిస్‌షిప్‌ జాబ్‌మేళా | - | Sakshi
Sakshi News home page

27న అప్రెంటిస్‌షిప్‌ జాబ్‌మేళా

Jun 21 2025 3:01 AM | Updated on Jun 21 2025 3:01 AM

27న అ

27న అప్రెంటిస్‌షిప్‌ జాబ్‌మేళా

విద్యారణ్యపురి: 2022 –2025 విద్యాసంవత్సరంలో ఇంటర్మీడియట్‌ ఒకేషనల్‌ కోర్సుల్లో ఉత్తీర్ణులైన విద్యార్థుల కోసం ఈనెల 27న హనుమకొండలోని ప్రభుత్వ ఒకేషనల్‌ జూనియర్‌ కాలేజీలో అప్రెంటిస్‌షిప్‌ జాబ్‌మేళా నిర్వహిస్తున్నారని, దీనిని వినియోగించుకోవాలని హనుమకొండ డీఐఈఓ ఎ. గోపాల్‌ కోరారు. జాబ్‌మేళా సన్నాహాక సమావేశం శుక్రవారం హనుమకొండ ప్రభుత్వ ఒకేషనల్‌ జూనియర్‌ కళాశాలలో నిర్వహించారు. ఈ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కార్యక్రమంలో హనుమకొండ, ములుగు, నెల్లికుదురు ప్రభుత్వ ఒకేషనల్‌ జూనియర్‌ కళాశాలల ప్రిన్సిపాళ్లు శ్రీధర్‌, ఎం.పి భగవద్గీత, ఎ. శ్రీనివాస్‌రెడ్డి, ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్‌ నవ్వసి శ్రీనివాస్‌, డాక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌, ఉమ్మడి వరంగల్‌ జిల్లా అధికారులు పాల్గొన్నారు.

గూడ్స్‌ షెడ్‌కు చేరిన 1,315 మెట్రిక్‌ టన్నుల యూరియా

ఖిలా వరంగల్‌ : వరంగల్‌ రైల్వేస్టేషన్‌లోని గూడ్స్‌ షెడ్‌కు శుక్రవారం ఉదయం ఆర్‌సీఎఫ్‌ కంపెనీకి చెందిన 1,315 మెట్రిక్‌ టన్నుల యూరియా చేరుకుంది. ఉమ్మడి వరంగల్‌ జిల్లా రైతుల కోసం చేరిన యూరియా వ్యాగన్‌ను ఆర్‌సీఎఫ్‌ కంపెనీ మేనేజర్‌ పురుషోత్తం రాథోడ్‌, ఖమ్మం డిస్ట్రిక్‌ ఇన్‌చార్జ్‌ అభిజిత్‌ గాంధీతో కలిసి మండల వ్యవసాయ అధికారి రవీందర్‌రెడ్డి పరిశీలించారు. జిల్లా అధికారుల ఆదేశాల మేరకు యూరియాను మార్క్‌ఫెడ్‌కు 60శాతం, ఫర్టిలైజర్‌ డీలర్లకు 40 శాతం కేటాయిస్తామని కంపెనీ నిర్వాహకులు తెలిపారు. జిల్లాలో యూరియా కొరత లేకుండా చూస్తామని, త్వరలోనే మరో వ్యాగన్‌ వచ్చే అవకాశం ఉందని కంపెనీ మేనేజర్‌ పేర్కొన్నారు. కార్యక్రమంలో గణేశ్‌, కంపెనీ సెల్స్‌ మేనేజర్లు పాల్గొన్నారు.

27న అప్రెంటిస్‌షిప్‌ జాబ్‌మేళా
1
1/1

27న అప్రెంటిస్‌షిప్‌ జాబ్‌మేళా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement