
దాతల సహకారం అభినందనీయం
● వరంగల్ కలెక్టర్ సత్యశారద
ఎంజీఎం: ఎంజీఎం ఆస్పత్రిలో ిపీడియాట్రిక్ విభా గానికి పరికరాలు అందించిన దాతల సహకారం అభినందనీయమని వరంగల్ కలెక్టర్ సత్యశారద అన్నారు. శుక్రవారం ఎంజీఎం పీడియాట్రిక్ విభా గానికి బిలియన్ హాట్స్ బ్రీతింగ్ ఫౌండేషన్, జనప్రియ సంయుక్త ఆధ్వర్యంలో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద రూ. 60 లక్షల విలువైన పీడియాట్రిక్ విభాగానికి అవసరమయ్యే ఎక్స్ రే, ఈసీ జీ మెషిన్, పారా మానిటర్లు, డబుల్ సర్ఫేస్ ఫొటో థెరపీ వంటి 13 వివిధ రకాల పరికరాలను ఫౌండేషన్ ప్రతినిధులతో కలిసి కలెక్టర్ సత్యశారద ప్రారంభించి మాట్లాడారు. దాతలు అందించిన పరికరాలతో చిన్నారులకు మెరుగైన సేవలు అందుతాయన్నా రు. అనంతరం దాతలను సన్మానించారు. బిలియన్ హార్ట్స్ బ్రీతింగ్ ఫౌండేషన్ కంట్రీ హెడ్ సుధా జిజారియా, జనప్రియ చైర్మన్ రవీందర్రెడ్డి, ఎండీ సతీశ్ కుమార్, ఎంజీఎం పర్యవేక్షకులు కిశోర్, డీఎంహెచ్ ఓ సాంబశివరావు, ఆర్ఎంఓలు, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.
కేఎంసీలో..
వైద్య, శాసీ్త్రయ రంగాల్లో పరిశోధనలకు మద్దతుగా కాకతీయ మెడికల్ కళాశాలలో మల్టీ డిసిప్లీనరీ రీసెర్చీ యూనిట్ను శుక్రవారం వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి, వరంగల్ ఎంపీ కడియం కావ్య, మేయర్ సుధారాణి ప్రారంభించారు. వారు మాట్లాడుతూ.. జిల్లాను ఆరోగ్య కేంద్రంగా అభివృద్ధి చేయడంలో ఈయూనిట్ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. కేఎంసీ ప్రిన్సిపాల్ రాంకుమార్రెడ్డి, డీహెచ్ఆర్ ప్రాజెక్టు డైరెక్టర్ సునీల్పంత్, ప్రతినిధులు కుమార్ విక్రమ్, నర్సంపేట మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ మోహన్దాస్, అధ్యాపకులు, వైద్య విద్యార్థులు పాల్గొన్నారు.