ముగిసిన ఉద్యోగ సంఘాల ఎన్నికల ఓటింగ్‌ | - | Sakshi
Sakshi News home page

ముగిసిన ఉద్యోగ సంఘాల ఎన్నికల ఓటింగ్‌

Jun 21 2025 3:01 AM | Updated on Jun 21 2025 3:01 AM

ముగిసిన ఉద్యోగ సంఘాల ఎన్నికల ఓటింగ్‌

ముగిసిన ఉద్యోగ సంఘాల ఎన్నికల ఓటింగ్‌

కేయూ క్యాంపస్‌: కాకతీయ యూనివర్సిటీలోని ఎన్జీఓ ఎంప్లాయీస్‌, క్లాస్‌ ఫోర్త్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్ల ఎన్నికలకు శుక్రవారం ఓటింగ్‌ ప్రక్రియ నిర్వహించారు. కేయూ పరిపాలన భవనంలోని సెనేట్‌హాల్‌, సుబేదారిలోని యూనివర్సిటీ కాలేజీ, ఖమ్మం పీజీసెంటర్‌, భద్రాద్రికొత్తగూడెం ఇంజనీరింగ్‌కాలేజీలో పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటుచేశారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు ఓటింగ్‌ ప్రక్రియ జరిగింది. కేయూ ఎన్జీఓ అసోసియేషన్‌లో 222 మంది ఓటర్లు ఉండగా 221 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. క్లాస్‌ఫోర్త్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌లో 79 మంది ఓటర్లు ఉండగా 76 మంది ఉద్యోగులు ఓటుహక్కు వినియోగించుకన్నారు. ఎన్నికల అధికారిగా ప్రొఫెసర్‌ కె.రాజేందర్‌, అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారిగా పంజాల శ్రీధర్‌ వ్యవహరించారు. అసిస్టెంట్‌ రిజిస్ట్రార్లు ప్రణయ్‌కుమార్‌, బి.నేతాజీ, నర్సింహారావు, సూపరింటెండెంట్‌ కె. శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

నేడు ఓట్ల లెక్కింపు ..

ఉద్యోగాల సంఘాల ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఈనెల 21న ఉదయం 11గంటలకు జరగనుంది. లెక్కింపు అనంతరం సంబంధిత అధికారులు ఫలితాలు వెల్లడిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement