
దరఖాస్తుల వెల్లువ
శనివారం శ్రీ 21 శ్రీ జూన్ శ్రీ 2025
– 8లోu
మహబూబాబాద్: రాష్ట్ర ప్రభుత్వం భూ సమస్యల పరిష్కారం కోసం భూభారతి చట్టం తీసుకొచ్చింది. ఈమేరకు అధికారులు గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించి భూ సమస్యలు ఉన్న రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈనెల 3నుంచి 16వ తేదీ వరకు గ్రామాల్లో సదస్సులు నిర్వహించగా.. 17నుంచి 20వ తేదీ వరకు తహసీల్దార్ కార్యాలయాల్లో అర్జీలు స్వీకరించారు. ఈమేరకు జిల్లా వ్యాప్తంగా పైలెట్ మండలం దంతాలపల్లి మినహా మిగిలిన 17మండలాల్లో 31,900 దరఖాస్తులు వచ్చాయి. 2022 అర్జీలు మాత్రమే ఆన్లైన్ చేశారు. కాగా, చట్టం అమలు కోసం సర్వేయర్ల శిక్షణ కొనసాగుతోంది.
ముగిసిన దరఖాస్తుల స్వీకరణ..
భూభారతి చట్టం అమలులో భాగంగా మొదట దంతాలపల్లి మండలాన్ని పైలెట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేసి రెవెన్యూ సదస్సులు పూర్తి చేశారు. అక్కడ విజయవంతం కావడంతో మిగిలిన మండలాల్లో సదస్సులు నిర్వహించారు. కాగా ఈనెల 20వ తేదీ మధ్యాహ్నం 12గంటల వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఇచ్చారు. తహసీల్దార్ కార్యాలయాల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి స్వీకరించారు. ఆతర్వాత రెవెన్యూ గ్రామాల వారీగా దరఖాస్తులను వేరు చేసి ఆన్లైన్ చేస్తారు.
ఆన్లైన్ తర్వాత ప్రక్రియ..
రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులు ఆన్లైన్ అయిన తర్వాత.. అర్జీల ఆధారంగా ఇరుగుపొరుగు రైతులకు నోటీస్లు ఇచ్చి సర్వేయర్లు సర్వే చేస్తారు. ఆ తర్వాత తహసీల్దార్, ఆర్డీఓ, కలెక్టర్ లాగిన్లో సమాచారం ఉంటుంది. తహసీల్దార్, ఆర్డీఓలకు కూడా డిజిటల్ సంతకం అవకాశం ఇచ్చారు. అన్ని సవ్యంగా ఉంటే పాస్పుస్తకంతో పాటు మ్యాప్ కూడా ఇవ్వనున్నారు.
కొనసాగుతున్న సర్వేయర్ల శిక్షణ..
భూ భారతి చట్టం అమలులో భాగంగా సర్వేయర్ల సంఖ్య తక్కువగా ఉండడంతో ప్రభుత్వం కొత్తగా సర్వేయర్లకు అవకాశం కల్పించింది. జిల్లాలో 18 మండలాలకు కేవలం పదిమంది రెవెన్యూ సర్వేయర్లు ఉన్నారు. జిల్లాలో ఉన్న లైసెన్స్ సర్వేయర్లకు అవకాశం కల్పించగా మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకున్నారు. జిల్లాలో 203 దరఖాస్తు వచ్చాయి. శిక్షణ కోసం 183 మంది హాజరయ్యారు. వారికి గత నెల 26నుంచి శిక్షణ ప్రారంభం కాగా.. 50 రోజులు కొనసాగుతుంది. అన్ని అర్హతలు సాధిస్తే లైసెన్స్లు జారీ అవుతాయని అధికారులు తెలిపారు.
గత నెల 25న జీపీఓల పరీక్ష..
భూ భారతి అమలు కోసం గ్రామపరిపాలన అధికారుల నియామకం చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాగా పూర్వ వీఆర్వో, వీఆర్ఏలకు అవకాశం కల్పించిన విషయం విదితయే. గత నెల 25న రాత పరీక్ష నిర్వహించగా కేవలం 112మంది ఉత్తీర్ణత సాధించారు. 20మందిఫెయిల్ అయ్యారు. కాగా అర్హత సాధించిన వారికి ఇప్పటివరకు నియామక పత్రాలు అందించలేదు.
న్యూస్రీల్
దరఖాస్తుల వివరాలు..
మండలం దరఖాస్తులు ఆన్లైన్ సంఖ్య
మానుకోట 6,144 228
కురవి 2,205 278
కేసముద్రం 1,116 370
డోర్నకల్ 1,451 302
గూడూరు 2,051 7
కొత్తగూడ 506 75
గంగారం 560 0
బయ్యారం 1,938 62
గార్ల 3,279 0
సీరోలు 2,062 203
ఇనుగుర్తి 1,714 107
చిన్నగూడూరు 459 0
తొర్రూరు 2,513 328
నెల్లికుదురు 1,456 61
మరిపెడ 2,684 0
నర్సింహులపేట 1,028 0
పెద్దవంగర 734 1
మొత్తం 31,900 2,022
ముగిసిన భూభారతి రెవెన్యూ సదస్సులు
జిల్లాలో 31,900 అర్జీల స్వీకరణ
చివరిరోజు తహసీల్దార్ కార్యాలయాల వద్ద రైతుల సందడి
కొనసాగుతున్న సర్వేయర్ల శిక్షణ
దరఖాస్తుల స్వీకరణ పూర్తి
ఈనెల 20వ తేదీ వరకు ప్రత్యేక కౌంటర్ల ద్వారా దరఖాస్తుల స్వీకరణ పూర్తి చేశాం. త్వరగా రెవెన్యూ గ్రామాలవారీగా ఆన్లైన్ చేసి ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రక్రియ చేపడుతాం.
–చంద్ర రాజేశ్వర్, మానుకోట తహసీల్దార్
సర్వేయర్ల శిక్షణ కొనసాగుతోంది
మొదటి విడతలో 183 మంది సర్వేయర్లకు శిక్షణ జరుగుతుంది. వారికి ప్రభుత్వ పరంగా లైసెన్స్ వచ్చిన తర్వాత భూ భారతి చట్టంలో వారితో దరఖాస్తుల సర్వే జరుగుతుంది. జిల్లాలో ప్రస్తుతం పదిమంది సర్వేయర్లు మాత్రమే ఉన్నారు.
– నర్సింహమూర్తి, ఏడీ ఎస్ఎల్ఆర్

దరఖాస్తుల వెల్లువ

దరఖాస్తుల వెల్లువ

దరఖాస్తుల వెల్లువ