నేడు మండలంలో మంత్రి పొంగులేటి పర్యటన | - | Sakshi
Sakshi News home page

నేడు మండలంలో మంత్రి పొంగులేటి పర్యటన

Jun 21 2025 3:00 AM | Updated on Jun 21 2025 3:00 AM

నేడు

నేడు మండలంలో మంత్రి పొంగులేటి పర్యటన

బయ్యారం: మండలంలోని పలు గ్రామాల్లో శనివారం రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పర్యటించనున్నట్లు సొసైటీ చైర్మన్‌ మధుకర్‌రెడ్డి, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు ముసలయ్య తెలిపారు. శుక్రవారం సొసైటీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. మండలంలోని కంబాలపల్లి, జనార్దనపురం, బయ్యారం, గంధంపల్లి–కొత్తపేట, సింగారం గ్రామాల్లో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన, విగ్రహావిష్కరణ కార్యక్రమాల్లో మంత్రితో పాటు ఎంపీ బలరాంనాయక్‌, ఎమ్మెల్యే కోరం కనకయ్య పాల్గొంటా రని వారు పేర్కొన్నారు. కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు మంత్రి పర్యటనలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో నాయకులు ప్రభాకర్‌రెడ్డి, శ్రీను, రవి, నాగరాజు, లింగ్య, వెంకట్‌రెడ్డి, రాంరెడ్డి, మేఘాచారి తదితరులు పాల్గొన్నారు.

1,93,851 మంది

రైతులకు ‘భరోసా’

మహబూబాబాద్‌ రూరల్‌ : జిల్లాలో 1,93,851 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ అయినట్లు డీఏఓ విజయనిర్మల అన్నారు. డీపీఆర్‌ఓ రాజేంద్రప్రసాద్‌, వ్యవసాయ శాఖ ఏడీఏలు శ్రీనివాసరావు, మురళీతో కలిసి కలెక్టరేట్‌లో శుక్రవారం డీఏఓ విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో ప్రభుత్వం 1,93,851మంది రైతుల ఖాతాల్లో రూ. 202.49 కోట్లు జమ చేసినట్లు తెలిపారు. ఇందులో 22,108 మంది ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ రైతులకు రూ.30.24 కోట్లు పెట్టుబడి సాయం అందించామని పేర్కొన్నారు. రైతు భరోసా నిధులతో ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు, కలుపు మందులు కొనుగోలు చేసుకోవాలని రైతులకు సూచించారు.

విద్యుత్‌శాఖ ఎస్‌ఈగా శ్రీనివాసాచారి

నెహ్రూసెంటర్‌: మహబూబాబాద్‌ జిల్లా విద్యుత్‌శాఖ ఎస్‌ఈగా ఇ.శ్రీనివాసా చారికి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ విద్యుత్‌శాఖ సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. మహబూబాబాద్‌ ఎస్‌ఈ ఏసీబీ అధికారులకు పట్టుబడడంతో.. ఆయన స్థానంలో ఖమ్మం జిల్లా ఎస్‌ఈగా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాసాచారికి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈమేరకు ఆయన చార్జ్‌ తీసుకున్నారు. విద్యుత్‌ ఉద్యోగులు ఎస్‌ఈని కలిసి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు.

ప్రపంచ ఆర్థికశక్తిగా భారత్‌

కొత్తగూడ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 11ఏళ్ల పాలనలో భారతదేశం ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎదిగిందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చింతలపూడి భాస్కర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో జరిగిన విజయ సంకల్ప సభలో ఆయన మాట్లాడారు. ప్రపంచ దేశాల్లో నేరుగా రూపాయి మారకంతో పాటు రక్షణ వ్యవస్థలో అగ్ర దేశాల సరసన నిలిచిందన్నారు. కాంగ్రెస్‌ పాలనలో అవినీతి, స్కాంలే తప్ప మరేమీ మిగలలేదని విమర్శించారు. ఈసభలో బీజేపీ మండల నాయకులు యాదగిరి మురళి, మధు, బోడ నవీన్‌నాయక్‌, రవి, ప్రవీన్‌, సుమన్‌, అనిల్‌, రవీందర్‌ తదితరులు పాల్గొన్నారు.

విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి

తొర్రూరు: విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని పీడీఎస్‌యూ జిల్లా ప్రధాన కార్యదర్శి బానోతు దేవేందర్‌ అన్నారు. డివిజన్‌ కేంద్రంలో శుక్రవారం పీడీఎస్‌యూ ముఖ్యకార్యకర్తల సమావేశం నిర్వహించారు. దేవేందర్‌ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో మూత్రశాలలు, తాగునీరు కరువయ్యాయని, విద్యార్థుల సరిపడా ఫర్నిచర్‌ సైతం లేదని వాపోయారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని, నాసిరకం భోజనం తిని విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్నారని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు భూక్య సుమన్‌, రాజేష్‌, హేమంత్‌, గణేష్‌, సుమన్‌ పాల్గొన్నారు.

నేడు మండలంలో మంత్రి పొంగులేటి పర్యటన1
1/1

నేడు మండలంలో మంత్రి పొంగులేటి పర్యటన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement