
ఆస్పత్రుల్లో సేవల వివరాలు ప్రదర్శించాలి
నెహ్రూసెంటర్: ప్రైవేట్ ఆస్పత్రుల్లో రోగులకు అందిస్తున్న సేవల వివరాలు, రుసుము, ధరల పట్టికలు, వైద్యుల వివరాలను అందరికీ కనిపించేలా ప్రదర్శించాలని డీఎంహెచ్ఓ రవిరాఽథోడ్ సూచించారు. జిల్లా కేంద్రంలోని శ్రీచక్ర, సాయిపల్లవి ఆస్పత్రులను శుక్రవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ.. ఆస్పత్రుల్లో పని చేసే వైద్యుల, సిబ్బంది అర్హత సర్టిఫికెట్లు వివరాలను వెల్లడించాలని, వైద్య ఆరోగ్యశాఖలో సర్టిఫికెట్లను అందజేయాలన్నారు. విదేశాల్లో ఎంబీబీఎస్ చదివినవారు భారత ప్రభుత్వం నిర్వహించే అర్హత పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలని, వారి డిగ్రీలు కేవలం ఎంబీబీఎస్కు మాత్రమే సమానమని, ఎండీ అని రాసుకోవద్దని హెచ్చరించారు. తనిఖీల్లో డిప్యూటీ మాస్ మీడియా అధికారి కొప్పు ప్రసాద్, జూనియర్ అసిస్టెంట్ అనిల్కుమార్, రాకేష్ పాల్గొన్నారు.
వైద్య సహాయం అందజేయాలి..
జిల్లాలో 0నుంచి 18ఏళ్ల పిల్లలకు జెనెటిక్, జన్మతః, పోషకాహార సంబంధిత, ఆరోగ్య సమస్యలను గుర్తించి వైద్య సహాయం అందజేయాలని ఆర్బీఎస్కే అధికారులకు డీఎంహెచ్ఓ రవిరాథోడ్ సూచించారు. జిల్లా వైద్యాధికారి కార్యాలయంలో ఆర్బీఎస్కే సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడారు. సమావేశంలో ప్రోగ్రాం అధికారులు లక్ష్మీనారాయణ, విజయ్కుమార్, డెమో ప్రసాద్, కేవీ రాజు, రామకృష్ణ, అనిల్కుమార్, ఆర్బీఎస్కే, డీఈఐసీ సెంటర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
డీఎంహెచ్ఓ రవిరాథోడ్