
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు రుణాలు
కేసముద్రం: ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన మహిళా సంఘాల్లోని సభ్యులకు బ్యాంకు లింకేజీ రుణాలు మంజూరు చేయిస్తామని డీఆర్డీఓ మధుసూదన్రాజు అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని సీ్త్ర శక్తి భవన్లో అంతర్జాతీయ సహకార సంవత్సరం–25ను పురస్కరించుకుని మండల సమాఖ్య మహిళా సభ్యులతో శుక్రవారం సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళా సాధికారిత కోసం ప్రతిష్టాత్మకంగా అనే పథకాలను ప్రవేశపెడుతోందన్నారు. ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు, పెట్రోల్ బంక్లు, ఆర్టీసీ బస్సుల నిర్వహణ, సౌరవిద్యుత్ కేంద్రాలను ఏర్పాటు చేస్తుందన్నారు. అదే విధంగా జిల్లా సహకార అధికారి ఎన్.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. సహకార సంఘాల ద్వారా మహిళలు ప్రస్తుతం మార్కెట్ డిమాండ్కు అనుగుణంగా అనుకూలమైన ఉత్పత్తులను తయారు చేసి గొప్ప వ్యాపారవేత్తలుగా ఎదగాలన్నారు. అనంతరం మండలంలోని కల్వల గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు మార్కింగ్, భూమిపూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో డీపీఆర్వో రాజేంద్రప్రసాద్, జిల్లా హార్టికల్చర్ అధికారి మరి యన్న, డీపీఎం నళిని, ఏపీఎం రాజీర్, మండల సమాఖ్య సిబ్బంది అమృత, సోఫియా, ఉమా, వెంకటనారాయణ, శ్రీనివాస్, వెంకటరమణ, పరుశురాం తదితరులు పాల్గొన్నారు.