
వైద్య కళాశాల పనులు పూర్తి చేయాలి
నెహ్రూసెంటర్: ప్రభుత్వ వైద్య కళాశాల పనులను వెంటనే పూర్తి చేయాలని ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్ సూచించారు. జిల్లా కేంద్రంలోని వైద్య కళాశాల పనులను గురువారం పరిశీలించి విద్యార్థులతో మాట్లాడారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే పనులను అసంపూర్తిగానే మిగిలిపోయాయని, దీంతో విద్యార్థులు ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు. అరకొర వసతుల వల్ల ఇబ్బందులు పడాల్సి వస్తుందని విద్యార్థులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా.. పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని వివరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, విద్యార్థులు, అధికారులు, అధ్యాపకులు పాల్గొన్నారు.
ఒకే వేతన విధానం ఉండాలి
కురవి: రాష్ట్ర దేవాదాయశాఖలో పనిచేసే అర్చక, ఉద్యోగులు రెండు నెలలుగా వేతనాలు రాక అర్ధాకలి, అప్పుల బాధతో ఇబ్బందులు పడుతున్నారని, ఒకే శాఖలో పనిచేసే అందరికి ఒకే వేతన విధానం ఉండాలని రాష్ట్ర అర్చక ఉద్యోగ జేఏసీ కన్వీనర్ డీవీఆర్ శర్మ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆలయంలో స్వామి వారిని దర్శించుకున్నారు. సంఘం సమావేశంలో పాల్గొని మాట్లాడారు. జీఓ 577కు తూట్లు పొడుస్తున్నారని విమర్శించారు. రెండు నెలలుగా వేతనాలు రాక అర్చక, ఉద్యోగులు అవస్థలు పడుతున్నారని తెలిపారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు రెడ్యాల శ్రీనివాస్ శర్మ, పెనుగొండ అనిల్ శర్మ, దూసకంటి విజయ్శర్మ, అభిలాష్ శర్మ, రమేశ్, వేదపండితులు బాలకృష్ణశర్మ, శ్రీకాంతాచార్యులు, ఆలయ ఉద్యోగి జగన్ పాల్గొన్నారు.
దరఖాస్తుల ఆహ్వానం
మహబూబాబాద్ అర్బన్: బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో సివిల్ సర్వీస్ లాంగ్ టర్మ్ ఉచిత శిక్షణ తరగతులు జూలై 25 నుంచి వచ్చే ఏడాది ఏప్రిల్ వరకు 150 మంది అభ్యర్థులకు నిర్వహించనున్నట్లు బీసీ సంక్షేమ శాఖ అధికారి ఎం.నర్సింహరావు తెలిపారు. నేటి నుంచి జూలై 8 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు 040–29303130, 040–24071178, 7780359322 ఫోన్ నంబర్లలో సంప్రదించాలన్నారు.
బాలుడి గొంతులో
ప్లాస్టిక్ గన్ బుల్లెట్
● ఏడాదిగా నొప్పి, మింగలేక ఇబ్బందులు
● శస్త్రచికిత్స ద్వారా బయటకు తీసిన వైద్యుడు
ఖమ్మంవైద్యవిభాగం: ఆడుకునే క్రమాన ప్లాస్టిక్ గన్ బుల్లెట్ను నోట్లో పెట్టుకోగా అది బాలుడి గొంతులో ఇరుక్కుపోయింది. దీంతో ఏడాది కాలంగా నొప్పి, ఏదీ సరిగా తినలేక ఇబ్బంది పడుతుండగా శస్త్రచికిత్స ద్వారా బయటకు తీసిన వైనమిది. మహబూబాబాద్ జిల్లా పాతపోచారం గ్రామానికి చెందిన పి.శ్రవణ్కుమార్ – సౌజన్య దంపతుల మూడేళ్ల కుమారుడు షణ్ముక్ కొంత కాలంగా గొంతు నొప్పి, మింగలేకపోవటం, తినలేక బాధపడుతున్నాడు. చాలా ఆస్పత్రులకు వెళ్లినా ఫలితం లేక ఖమ్మం నెహ్రూనగర్లోని ప్రవీణ్ ఈఎన్టీ ఆస్పత్రిలో డాక్టర్ ఎం.జీ.వీ.ప్రవీణ్ను సంప్రదించారు. బాలుడికి ఎండోస్కోపీ నిర్వహించినా ఫలితం లేక ిసీటీ స్కాన్ చేయగా గొంతు వెనుక భాగంలో వస్తువు కనిపించింది. అత్యంత సున్నితమైన మెదడు అడుగు భాగాన పదునైన వస్తువు ఉన్నట్లు తేలగా శస్త్రచికిత్స ద్వారా బయటకు తీయడంతో ప్లాస్టిక్ గన్ బుల్లెట్గా గుర్తించారు. దీన్ని అలానే వదిలేసి ఉంటే కపాలం నుంచి మెదడులోకి చొచ్చుకెళ్లి మెదడుకు రక్తం సరఫరా చేసే రక్తనాళాలను పాడు చేసేదని వైద్యుడు తెలిపారు.
వృత్తి నైపుణ్యం సాధించాలి
వరంగల్ క్రైం: పోలీస్ అధికారులు అప్పగించిన పనుల్లో రాణించాలంటే వృత్తిలో నైపుణ్యం సాధించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ అధికారులకు సూచించారు. యూ నిట్ స్థాయి పోలీస్ డ్యూటీ మీట్ పోటీలను వరంగల్ పోలీస్ కమిషనర్ గురువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డీసీపీలు షేక్ సలీమా, అంకిత్ కుమార్, రాజమహేంద్ర నా యక్ అదనపు డీసీపీ రవి, సురేశ్కుమార్, ప్రభాకర్రావు, బోనాల కిషన్ పాల్గొన్నారు.

వైద్య కళాశాల పనులు పూర్తి చేయాలి

వైద్య కళాశాల పనులు పూర్తి చేయాలి