
చందాలు వేసుకుని.. అద్దె చెల్లిస్తూ..
అడవి నుంచి.. పుడమి తల్లి ఒడికి
గాజర్ల రవి బుధవారం జరిగిన ఎన్కౌంటర్లో నేలకొరగగా నాటి ఉద్యమకారులు, గ్రామస్తులు కన్నీరుమున్నీరవుతున్నారు. నేడు అంత్యక్రియలు జరగనున్నాయి.
వాతావరణం
జిల్లాలో ఉదయం వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. మధ్యాహ్నం ఎండతో పాటు కాస్త ఉక్కపోతగా ఉంటుంది.
– 10లోu
మహబూబాబాద్ అర్బన్: జిల్లా కేంద్రంలోని పత్తిపాక ప్రభుత్వ పాఠశాల భవనం శిథిలావస్థకు చేరుకుంది. దీంతో ఆ భవనంలో పాఠశాల నిర్వహణ చేపట్టొద్దని గతేడాది మున్సిపల్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం అద్దె భవనంలో పాఠశాల నిర్వహణ చేపడుతున్నారు. పాఠశాలలో 35మంది విద్యార్థులు చదువుతున్నారు. కాగా ఒక గదిలో విద్యార్థులు, మరో గదిలో మధ్యాహ్న భోజనం వంటలు, చెట్టు కింద 5వ తరగతి విద్యార్థులకు బోధన చేపడుతున్నారు. కాగా విద్యార్థుల తల్లిదండ్రులు, టీచర్లు చందాలు వేసుకొని నెలకు రూ.5వేల కిరాయి చెల్లిస్తున్నారు. పాఠశాల పాత భవనం పూర్తిస్థాయిలో తొలగించి నూతన భవనం నిర్మించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.