
247 క్యూసెక్కుల నీరు పంపింగ్
కన్నాయిగూడెం: ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెంలోని దేవాదుల ఇన్టెక్ వెల్ వద్ద ఒక మోటారు ద్వారా పంపింగ్ నిలిపి వేశారు. పంపింగ్ వద్ద మూడు ఫేజ్లలో పది మో టార్లు ఉండగా అందులో సెకండ్ ఫేజ్లో ఉన్న రెండు మోటార్లను ఆన్ చేసి 494 క్యూసెక్కుల నీటిని దిగువకు బుధవారం వరకు పంపింగ్ చేశారు. ఈ క్రమంలో గురువారం అందులోని ఒక మోటారును ఆఫ్ చేసి మరో మోటారు ద్వారా 247 క్యూసెక్కుల నీటిని మాత్రమే దిగువకు పంపింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం దేవాదుల వద్ద 73.20 మీటర్ల నీటిమట్టం కొనసాగుతోంది. దీనితో పాటు తుపాకులగూడెం వద్ద ఉన్న సమ్మక్క సాగర్ బ్యారేజీ వద్ద ఎగువ నుంచి 5,800 క్యూసెక్కుల నీరు చేరుతుండడంతో బ్యా రేజీ వద్ద రెండు గేట్లను ఎత్తి 6,000క్యూసెక్కుల నీరు దిగువకు వదులుతున్నారు. ప్రస్తుతం బ్యారేజీ వద్ద 73.45మీటర్ల నీటి మట్టం కొనసాగుతోంది