దూరవిద్య కోర్సుల అడ్మిషన్లకు నోటిఫికేషన్‌ | - | Sakshi
Sakshi News home page

దూరవిద్య కోర్సుల అడ్మిషన్లకు నోటిఫికేషన్‌

Jun 20 2025 6:29 AM | Updated on Jun 20 2025 6:29 AM

దూరవి

దూరవిద్య కోర్సుల అడ్మిషన్లకు నోటిఫికేషన్‌

కేయూ క్యాంపస్‌: కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని దూరవిద్య కేంద్రంలో డిగ్రీ, పీజీ డిప్లొమా సర్టిఫికెట్‌, ఓరియెంటేషన్‌ కోర్సుల్లో ఈ విద్యాసంవత్సరం 2025–2026లో ప్రవేశాలకుగాను నోటిఫికేషన్‌ విడుదల చేశారు. గురువారం ఇందుకు సంబంధించిన వాల్‌ పోస్టర్లను వీసీ కె.ప్రతాప్‌రెడ్డి విడుదల చేశారు. ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లోనూ అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవచ్చునని దూరవిద్యకేంద్రం డైరెక్టర్‌ బి.సురేశ్‌లాల్‌ తెలిపారు. ఈ నెల 20వ తేదీనుంచి జూలై 31వరకు దరఖాస్తులు సమర్పించవచ్చని పేర్కొన్నారు. కోర్సులు, ఫీజుల వివరాలు సంబంధిత వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. కార్యక్రమంలో కేయూ రిజిస్ట్రార్‌ వి. రామచంద్రం, అదనపు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్‌ పద్మజ, దూరవిద్యకేంద్రం సైన్స్‌కోర్సుల అసిస్టెంట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ శ్రీనివాస్‌ముంజం, డాక్టర్‌ వి.జగన్‌, డాక్టర్‌ కొట్టే భాస్కర్‌ పాల్గొన్నారు.

అన్నను చంపిన ఘటనలో ఐదుగురిపై కేసు నమోదు

కురవి: అన్నను చంపిన ఘటనలో ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు సీరోలు ఎస్సై నగేశ్‌ గురువారం తెలిపారు. సీరోలు గ్రామానికి చెందిన వల్లపు లింగన్న తన భూమిని సమానంగా పంచి ఇవ్వలేదనే కారణంతో అతడి రెండో భార్య కుమారులు నరేశ్‌, మహేశ్‌, నరేశ్‌ భార్య సౌందర్య, లింగన్న రెండో భార్య నర్సమ్మ, నున్న వీరన్న (నరేశ్‌ బావమరిది) కలిసి లింగన్న మొదటి భార్య కుమారుడు కృష్ణను ఈ 18న కత్తితో నరికి చంపారు. ఈ ఘటనలో మృతుడి తండ్రి లింగన్న ఫిర్యాదు మేరకు ఐదుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నగేశ్‌ తెలిపారు.

చెక్‌ బౌన్స్‌ కేసులో

ఆరునెలలు జైలు

వరంగల్‌ లీగల్‌ : అప్పుగా తీసుకున్న రూ.4 లక్షలు చెల్లించని కారణంగా బాధితుడు కోర్టును ఆశ్రయించడంతో నిందితురాలికి ఆరు నెలల సాధారణ జైలు శిక్ష విధిస్తూ హనుమకొండ మొదటి మున్సిఫ్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు జడ్జి సీహెచ్‌. శ్రావణస్వాతి గురువారం తీర్పు వెలువరించారు. కేసు వివరాలు ఇలా ఉన్నాయి. హనుమకొండ బ్రాహ్మణవాడకు చెందిన సుంకరి నరేందర్‌.. కాజీపేట సిద్దార్థనగర్‌కు చెందిన యాట భాగ్యలక్ష్మికి 2024, జూన్‌ 15వ తేదీన రూ.4 లక్షల అప్పు ఇచ్చాడు. ఈ మేరకు భాగ్యలక్ష్మి.. నరేందర్‌కు ప్రామిసరీ నోటు రాసి ఇచ్చింది. రెండు నెలల్లో మొత్తం తిరిగి ఇస్తానని చెప్పింది. అయితే వివిధ కారణాలతో ఇవ్వకుండా సెప్టెంబర్‌లో హనుమకొండలోని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు సంబంధించిన రూ.4లక్షల చెక్కు ఇచ్చింది. సదరు డబ్బులు డ్రా చేసే నిమిత్తం నరేందర్‌ 2024, అక్టోబర్‌ 10వ తేదీన చెక్కును బ్యాంకులో వేయగా అకౌంట్‌లో సరిపోను డబ్బులు లేవని అధికారులు చెక్కు చెల్లదని తిరిగి ఇచ్చారు. దీనిపై బాధితుడు తన న్యాయవాది బైరి మల్లేశం ద్వారా కోర్టును ఆశ్రయించాడు. విచారించిన కోర్టు.. చెల్లని చెక్కు ఇచ్చిన ఘటనలో నేరం రుజువుకావడంతో నిందితురాలు భాగ్యలక్ష్మికి ఆరు నెలల జైలు శిక్ష, అప్పుగా తీసుకున్న మొత్తం రూ.4 లక్షలకు వడ్డీ, జరిమానా కింద రూ.3 లక్షలు మొత్తం రూ.7 లక్షలు చెల్లించాలని తీర్పు వెలువరించింది.

దూరవిద్య కోర్సుల  అడ్మిషన్లకు నోటిఫికేషన్‌
1
1/1

దూరవిద్య కోర్సుల అడ్మిషన్లకు నోటిఫికేషన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement