
మేడారం హుండీల కానుకల లెక్కింపు
ఎస్ఎస్తాడ్వాయి: మేడార సమ్మక్క, సారలమ్మ హుండీల కానుకలను బుధవారం మేడారంలోని డార్మెటరీ భవనంలో దేవాదాయశాఖ అధికారులు, పూజారుల సమక్షంలో కరీంనగర్ జిల్లాకు చెందిన శ్రీపల్లి సేవ సంస్థ ఆధ్వర్యంలో వలంటీర్లు లెక్కించారు. మేడారం ఈఓ వీరస్వామి పర్యవేక్షణలో హుండీల కానుకలను లెక్కించారు. సమ్మక్క హుండీ ఆదాయం రూ. 18,36,233, సారలమ్మ ఆదాయం రూ. 16, 59,383, పగిడిద్దరాజు ఆదాయం రూ. 72, 289, గోవిందరాజు ఆదాయం రూ, 81,463.. మొత్తం హుండీల ఆదాయం రూ. 36,49,368 లక్షలు వచ్చినట్లు ఈఓ వీరస్వామి తెలిపారు. కార్యక్రమంలో పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు, సూపరిండెంటెండ్ క్రాంతికుమార్, జూనియర్ అసిస్టెంట్లు జగదీశ్వర్, వీరన్న, మధు, బాలకృష్ణ, పూజారులు, తదితరులు పాల్గొన్నారు.