చదువుకొనే వేళ.. | - | Sakshi
Sakshi News home page

చదువుకొనే వేళ..

Jun 19 2025 4:22 AM | Updated on Jun 19 2025 4:22 AM

చదువు

చదువుకొనే వేళ..

ఖిలా వరంగల్‌: వేసవి సెలవులు ముగిశాయి. ఈనెల 12వ తేదీ నుంచి పాఠశాలలు పునః ప్రారంభమయ్యాయి. దీంతో విద్యార్థులు ఆటాపాటలకు టాటా చెప్పి బడిబాట పడుతున్నారు. అయితే తమ పిల్లలు చదువు‘కొన’డానికి తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. దీనికి కారణం స్కూల్‌ ఫీజులు. ఈ అంశ ఒక ఎత్తయితే వారికి కావాల్సిన విద్యాసామగ్రి కొనడం మరో ఆందోళన కలిగించే అంశం. ఈ క్రమంలో అప్పు చేసైనా తమ పిల్లలకు విద్యాసామగ్రి కొనుగోలు చేస్తున్నారు. దీంతో వరంగల్‌ నగరంలోని బుక్‌స్టాళ్లు, బ్యాగుల షాపులు, ‘షూ’ మార్టులు కిక్కిరిస్తున్నాయి. అయితే అన్ని వస్తువుల ధరలు గతేడాది కంటే పెరిగాయి. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు విద్యాసామగ్రి ఉచితంగా సమకూర్చుతున్నా తల్లిదండ్రులు వాటి వైపు కన్నెత్తి చూడడం లేదు. ఆర్థిక భారమైనా ప్రైవేట్‌ వైపు మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా కార్పొరేట్‌ హంగులకు సరిపడేలా తమ పిల్లలను తయారు చేసి పంపించాల్సి వస్తోంది.

పెరిగిన ‘షూ’ ధర..

‘షూ’ ధర గత సంవత్సరంతో పోల్చుకుంటే జతకు రూ.50 వరకు పెరిగింది. ప్రస్తుతం రూ.250 నుంచి రూ.500 వరకు అమ్ముతున్నారు. బ్రాండెడ్‌ షూ అయితే రూ.700 మధ్య లభిస్తున్నాయి.

పౌచ్‌ల ప్రపంచం..

ప్రస్తుతం ప్రతీ విద్యార్థి వద్ద పౌచ్‌ ఉండాల్సిందే. పెన్సిళ్లు, పెన్నులు, ఎరెజర్స్‌, ఇతర తినుబండారాలు ఇందులో భద్రపరుచుకుంటారు. ఎల్‌కేజీ మొదలు.. డిగ్రీ విద్యార్థుల వరకు పౌచ్‌ను వినియోగిస్తున్నారు. ఫలితంగా మార్కెట్‌లో ఈ వస్తువుకు డిమాండ్‌ ఉంది. రూ.40 నుంచి రూ. 200 వరకు ఉంది. పౌచ్‌ ధర కూడా గత సంవత్సరంతో పోల్చుకుంటే 10 శాతం వరకు పెరిగిందని వ్యాపారులు చెబుతున్నారు.

పెన్ను మరింత ప్రియం..

గతంలో ఎల్‌కేజీ, యూకేజీ, ఫస్ట్‌ క్లాస్‌ వరకు పెన్సి ల్‌తోనే రాయాల్సిండేది. ప్రస్తుతం లేదు. ఏకంగా పెన్నుతోనే రాత ప్రారంభిస్తున్నారు. ఫలితంగా ప్రస్తుతం మార్కెట్‌లో రూ. 3 నుంచి రూ.100 వరకు పెన్ను అందుబాటులో ఉంది. గతంలో పోల్చుకుంటే ప్రస్తుత ధరలో వ్యత్యాసం తీవ్రంగా కనిపిస్తోంది. పెన్సిళ్లు ధర రూ.4 నుంచి రూ.7, లెడ్‌ పెన్సిళ్లు రూ.5 నుంచి రూ.50 వరకు ఉంది.

స్కూల్‌ బ్యాగు ధర పైకి..

స్కూల్‌ బ్యాగు రూ.250 నుంచి రూ.వెయ్యి మధ్య లభిస్తోంది. గతేడాదితో పోలిస్తే ధర పెరిగింది. బ్రాండెడ్‌ స్కూల్‌ బ్యాగు ధర మరింత ప్రియం అయ్యింది. రూ.వెయ్యి నుంచి రూ.2వేల వరకు ఉంది.

అమాంతం పెరిగిన కుట్టుకూలి..

యూనిఫాం ధర నామమాత్రంగానే ఉంది. అయితే కుట్టు కూలి మాత్రం అమాంతం పెంచారు. జత కుట్టడానికి కూలి రూ.250 నుంచి రూ.500 తీసుకుంటున్నారు. అధిక శాతం ప్రైవేట్‌ స్కూళ్లు నేరుగానే విద్యార్థులకు రెడీమేడ్‌ ఇస్తున్నారు.

జామెట్రీ బాక్స్‌..

విద్యార్థులు ఎక్కువ కొనుగోలు చేసే వస్తువుల్లో జామెట్రీ బాక్స్‌ ఎక్కువ ఉంటుంది. దీనిని 4వ తరగతి నుంచే వినియోగిస్తున్నారు. ధర రూ.40 నుంచి రూ.250 వరకు అమ్ముతున్నారు. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం 5శాతం ధరలు పెరిగినట్లు వ్యాపారులే చెబుతున్నారు.

నోటు బుక్స్‌ కొనలేకపోతున్నాం..

గతేడాది పోల్చుకుంటే నోటుబుక్స్‌, పెన్నులు ,పెన్సిళ్లు, జామెట్రీ బాక్స్‌, పౌచ్‌, టెస్ట్‌ బుక్స్‌, షూ, స్కూల్‌ బ్యాగులు ధరలు పెరిగాయి. ఇద్దరు పిల్లలకు నోటుబుక్స్‌, పెన్నులు, ఇతర మెటీరియల్‌కు రూ.6వేల పైగా ఖర్చు చేశాం. పూర్తి స్థాయిలో నోటుబుక్స్‌, ఇతర వస్తువులు కొనలేకపోతున్నాం.

రంజిత్‌, కాశిబుగ్గ వరంగల్‌

కుట్టుకూలి ధరలు పెరిగాయి..

యూనిఫాం వినియోగం తగ్గింది. ప్రైవేట్‌, కార్పొరేట్‌ స్కూళ్లు తమకు విద్యార్థులకు నేరుగా ఇచ్చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉచితంగా యూనిఫాం ఇస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మా వద్ద కొనుగోలు చేసే వారు కరువయ్యారు. బట్ట ధర తక్కువ ఉంది. కుట్టు కూలి ధరలు మాత్రం పెరిగాయి. ఒక్కో జతకు రూ.250 నుంచి రూ. 400 వరకు తీసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితులు ఎన్నడూ ఎదుర్కొలేదు.

రాధాకృష్ణ, వస్త్ర వ్యాపారి వరంగల్‌

చుక్కల్లో బ్యాగులు, యూనిఫాం ధరలు

నోట్‌ పుస్తకాలు రేట్లు ౖపైపెకి..

పెరిగిన ధరలతో తల్లిదండ్రులు

ఆందోళన

చదువుకొనే వేళ.. 1
1/3

చదువుకొనే వేళ..

చదువుకొనే వేళ.. 2
2/3

చదువుకొనే వేళ..

చదువుకొనే వేళ.. 3
3/3

చదువుకొనే వేళ..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement