
ఈతకెళ్లి రైల్వే ఉద్యోగి మృతి
● మున్నేరువాగులో ఘటన
డోర్నకల్: స్నేహితులతో కలిసి సరదాగా ఈతకెళ్లిన ఓ రైల్వే ఉద్యోగి ప్రమాదవశాత్తు నీటమునిగి చనిపోయాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ సమీపంలోని మున్నేరువాగులో బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. సూర్యాపేట జిల్లా కోదాడకు చెందిన ఎర్రంశెట్టి సందీప్(28) డోర్నకల్లో రైల్వే ట్రైన్ మేనేజర్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. బుధవారం మిత్రులతో కలిసి సరదాగా మున్నేరువాగులో ఈతకు వెళ్లాడు. అక్కడ మిత్రులు ఈత కొడుతుండగా ఈతరాని సందీప్ వాగు ఒడ్డున నీటిలోకి దిగాడు. ప్రమాదవశాత్తు వాగులోకి జారి గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది, పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. స్థానిక మత్స్యకారుల సాయంతో వాగు నుంచి సందీప్ మృతదేహాన్ని బయటకు తీశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, మృతుడికి నాలుగు నెలల క్రితం వివాహం జరిగినట్లు సమాచారం.
చికిత్స పొందుతున్న
ఆర్మీ జవాన్ మృతి
శాయంపేట : భార్య వేధింపులతో గడ్డి మందు తాగి ఆత్మహత్యకు యత్నించిన ఓ ఆర్మీ జవాన్ చికిత్స పొందుతూ బుధవా రం మృతి చెందాడు. మండలంలోని మైలా రం గ్రామానికి చెందిన అరికిల్ల ప్రవీణ్(28) సికింద్రాబాద్ తిరుమలగిరిలోని టెరిటోరియల్ ఆర్మీ బెటాలియన్ 125లో విధులు నిర్వర్తిస్తున్నాడు. భార్య కొంత కాలంగా తనను వేధింపులకు గురిచేయడంతో పాటు మానసికంగా ఇబ్బందులకు గురి చేసింది. దీంతో మనస్తాపానికి గురైన ప్రవీణ్.. ఈ నెల 8న హనుమకొండలో గడ్డి మందు తాగాడు. వెంటనే హైదరా బాద్లోని మిలటరీ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స నిమిత్తం ప్రత్యేక హెలికాప్టర్లో పూణెకు తరలించగా ఆర్మీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కాగా, తన ఆత్మహత్యాయత్నానికి భార్య, అత్తామామలేనని కారణమని ప్రవీణ్ అంతకుముందు ఓ వీడియోలో వెల్లడించారు.
నేటి నుంచి
రెండు స్పెషల్ రైళ్లు..
కాజీపేట రూరల్ : కాజీపేట జంక్షన్ మీదుగా గురువారం నుంచి యశ్వంత్పూర్– యోగ్నాగరి రిషికేష్–యశ్వంత్పూర్ మధ్య రెండు స్పెషల్ రైళ్లు నడుస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎ.శ్రీధర్ బుధవారం తెలిపారు. ఈ నెల 19వ తేదీన యశ్వంత్పూర్–యోగ్ నాగరి రిషికేష్ (06597) ఎక్స్ప్రెస్, ఈ నెల 21వ తేదీన యోగ్నాగరి రిషికేష్–యశ్వంత్పూర్ (06598) ఎక్స్ప్రెస్ కాజీపేట జంక్షన్కు చేరుకుని వెళ్లనున్నట్లు తెలిపారు. ఫస్ట్ క్లాస్, సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ స్లీపర్, జనరల్ కోచ్లతో ప్రయాణించే ఈ రెండు రైళ్ల సర్వీస్లకు యొలహంక జంక్షన్, హిందుపురం, ధర్మవరం, అనంతపురం, డోన్, కర్నూల్సిటీ, కాచిగూడ, కాజీపేట, బల్లార్షా, నాగ్పూర్, భోపాల్, బీనాజంక్షన్, ఝాన్సీ, గ్వాలియర్, ఆగ్రా, మతుర, హజ్రత్నిజాముద్దీన్, గజియాబాద్, మీరట్ సిటీ, ముజఫర్నగర్, టాప్రి జంక్షన్, రూర్కి, హరిద్వార్లో హాల్టింగ్ కల్పించినట్లు ఆయన తెలిపారు.

ఈతకెళ్లి రైల్వే ఉద్యోగి మృతి

ఈతకెళ్లి రైల్వే ఉద్యోగి మృతి

ఈతకెళ్లి రైల్వే ఉద్యోగి మృతి