
ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
హన్మకొండ: ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సి.హెచ్.రాంచందర్ అన్నారు. బుధవారం హనుమకొండ రాంనగర్లోని సుందరయ్య భవన్లో ఫెడరేషన్ వరంగల్ రీజియన్ మహాసభ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికులపై వేధింపులు పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. డబుల్ డ్యూటీల పేరుతో డ్రైవర్లు, కండక్టర్లపై వేధింపులు మానుకోవాలన్నారు. ఉద్యోగులను శాశ్వత ప్రాతిపదికన నియమించాలని, డబుల్ డ్యూటీకి డబుల్ వేతనం చెల్లించాలన్నారు. ప్రభుత్వం, యాజమాన్యం విధానాలతో ప్రయాణికులు అసౌకర్యానికి గురై సిబ్బందిపై దాడులకు పాల్పడుతున్నారని, ఇలాంటి దాడులు జరగకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం ఫెడరేషన్ వరంగల్ రీజియన్ కమిటీని ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షుడిగా జి.ప్రభాకర్ రెడ్డి, అధ్యక్షుడిగా ఎల్లయ్య, ఉపాధ్యక్షులుగా బి.బాబు రావు, ఎల్.యాదగిరి, బి.సుధారాణి, అల్వార్, ఎన్.శ్రీనివాస్, వై.శ్రీనివాస్, కార్యదర్శిగా బి.యు.చారి, సంయుక్త కార్యదర్శులుగా ఎం.సతీశ్, ఓ.కొమ్మాలు, పి.కె.మూర్తి, డి.సంపత్, ఎం.డి.షాబుద్దీన్, ఎస్.పుష్ప, కోశాధికారిగా బి.శంకర్, ప్రచార కార్యదర్శిగా పి.మహేందర్ ఎన్నికయ్యారు. సమావేశంలో సీపీఎం హనుమకొండ జిల్లా అధ్యక్షుడు జి.ప్రభాకర్ రెడ్డి, సీఐటీయూసీ జిల్లా కార్యదర్శి రమేశ్ పాల్గొన్నారు.
స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర
ఉపాధ్యక్షుడు రాంచందర్