
ట్రెంచ్ పనులను అడ్డుకున్న పోడు రైతులు
కేసముద్రం: ఫారెస్టు అధికారులు చేపట్టిన ట్రెంచ్ పనులను పోడు రైతులు అడ్డుకున్న సంఘటన ఇనుగుర్తి మండలంలోని కోమటిపల్లి శివారు పాత తండా జీపీ సమీపంలో మంగళవారం జరిగింది. వివరాల ప్రకారం.. ఇనుగుర్తి సెక్షన్ పరిధిలోని 1149 కంపార్ట్మెంట్ నంబర్ భూమిలో అటవీశాఖ అధి కారులు జేసీబీ సాయంతో ట్రెంచ్ పనులు చేపడుతుండగా.. అక్కడికి పోడు రైతులు చేరుకొని, తాము ఎన్నో ఏళ్లుగా సాగు చేసుకుంటున్నామని, తమ వద్ద పత్రాలుఉన్నాయని పనులను అడ్డుకున్నారు. దీంతో ఇరువురి మధ్య తోపులాట జరిగింది. కాగా కేసముద్రం ఎస్సై మురళీధర్రాజు సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకున్నారు. రైతులకు నచ్చజేప్పే ప్రయత్నం చేయగా తాము ఎన్నో ఏళ్లుగా ఈ భూమిపై ఆధారపడి జీవిస్తున్నామని, ఇప్పుడు లాక్కోవడం సరికాదని వాపోయారు. చివరకు భూమి పత్రాలను పరిశీలించి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో వారు శాంతించారు.

ట్రెంచ్ పనులను అడ్డుకున్న పోడు రైతులు