
ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకోవాలి
● డీఈఓ రవీందర్రెడ్డి
కేసముద్రం: ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందని డీఈఓ రవీందర్రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని కల్వల జెడ్పీ హైస్కూల్ ఆధ్వర్యంలో నిర్వహించిన బడిబాట కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుతుందని, పైసా ఖర్చు లేకుండా పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు, నోట్బుక్స్ అందిస్తున్నట్లు తెలిపారు. ముందుగా గ్రామంలో విద్యార్థులచే ర్యాలీ, మానవహారం చేపట్టారు. కార్యక్రమంలో కేసముద్రం వ్యవసాయ మార్కెట్ చైర్మన్ గంట సంజీవరెడ్డి, హెచ్ఎంలు బండారు నరేందర్, కల్లెం వీరారెడ్డి, తెలంగాణ సాంస్కృతిక సారథి గిద్దె రాంనర్సయ్య, వెంకన్న, సివిల్ సప్లయీస్ డీఎం కృష్ణవేణి, డీపీఆర్ఓ రాజేంద్రప్రసాద్, ఎంఈఓ కాలేరు యాదగిరి తదితరులు పాల్గొన్నారు.