
మద్యం మత్తులో భార్యను చంపిన భర్త
● ఇస్రా తండాలో ఘటన
నెల్లికుదురు: మద్యం మత్తులో భర్త క్షణికావేశంలో భార్యను హత్య చేశాడు. ఈ ఘటన మంగళవారం మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం హేమ్లాతండా శివారు ఇస్రా తండాలో చోటు చేసుకుంది. ఎస్సై చిర్ర రమేశ్ బాబు కథనం ప్రకారం. తండాకు చెందిన బానోత్ భద్రు, రంగమ్మ (55) దంపతులు తరచూ గొడవ పడుతుండేవారు. ఈ క్రమంలో సోమవారం రాత్రి కూడా గొడవ జరిగింది. ఈ సమయంలో మద్యం మత్తులో ఉన్న భద్రు క్షణికావేశంలో రంగమ్మను గొంతునులిమి హత్య చేశాడు. అనంతరం క్షణికావేశంలో తానే హత్య చేశానని తండావాసుల ముందు ఒప్పుకున్నాడు. ఈ ఘటనపై మృతురాలి కూతురు వాంకుడోతు శ్రీలత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.