జైళ్ల శాఖ విశ్రాంత ఉద్యోగుల కమిటీ ఎన్నిక | - | Sakshi
Sakshi News home page

జైళ్ల శాఖ విశ్రాంత ఉద్యోగుల కమిటీ ఎన్నిక

Jun 16 2025 6:58 AM | Updated on Jun 16 2025 6:58 AM

జైళ్ల శాఖ విశ్రాంత ఉద్యోగుల కమిటీ ఎన్నిక

జైళ్ల శాఖ విశ్రాంత ఉద్యోగుల కమిటీ ఎన్నిక

కాజీపేట రూరల్‌ : ఉమ్మడి వరంగల్‌ జిల్లా జైళ్ల శాఖ విశ్రాంత ఉద్యోగుల కమిటీని ఆదివారం ఎన్నుకున్నట్లు దర్గా కాజీపేటకు చెందిన చర్లపల్లి జైలు రిటైర్డ్‌ సూపరింటెండెంట్‌ జి.సమ్మయ్య తెలిపారు. హనుమకొండలో జైళ్లశాఖ విశ్రాంత ఉద్యోగులు సమావేశమై కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఆయన తెలిపారు. గౌరవ అధ్యక్షుడిగా జి.సమ్మయ్య, ప్రెసిడెంట్‌గా సిహెచ్‌.రాధాకృష్ణ, సెక్రటరీగా ఎన్‌.సమ్మయ్య, ట్రెజరర్‌గా కె.నర్సయ్య, కార్యదర్శులుగా ఎం.రవీందర్‌, ఎ.యాదగిరి, టి.ప్రకాశ్‌, సిహెచ్‌.గణపతి, మహిళా కార్యదర్శిగా జె.ప్రభావతి, లీగల్‌ అడ్వైజర్‌గా కె.నర్సింహాస్వామిని ఎన్నుకున్నారు.

బస్టాండ్‌ షాపుల యజమానులకు కౌన్సెలింగ్‌

వరంగల్‌ క్రైం: హనుమకొండ బస్టాండ్‌, పరిసర ప్రాంతాల షాపుల, లాడ్జిల యజమానులకు హనుమకొండ ఇన్‌స్పెక్టర్‌ ఎం.శివకుమార్‌ ఆదివారం కౌన్సెలింగ్‌ నిర్వహించారు. రాత్రి 10.30 గంటల తర్వాత షాపులు నిర్వహించొద్దన్నారు. లాడ్డిలలో ఉండే వ్యక్తుల వివరాలు, ఆధార్‌, ఫోన్‌ నంబర్‌ తీసుకోవాలని, ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరిగినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement