
రెండు బైక్లు ఢీ..
● ఒకరి మృతి.. తొర్రూరులో ఘటన
తొర్రూరు: రెండు బైక్లు ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఎస్సై ఉపేందర్ కథనం ప్రకారం.. తొర్రూరుకు చెందిన సర్వి రమేశ్ (42) తొర్రూరు ఎంఈఓ కార్యాలయంలో సీఆర్పీగా విధులు నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. శనివారం రాత్రి తన వ్యక్తి గత పనుల నిమిత్తం తొర్రూరు బస్టాండ్ వద్దకు వెళ్లాడు. అనంతరం ఇంటికి వస్తున్న క్రమంలో అన్నారం రోడ్డుపై జఫర్గఢ్ మండలానికి చెందిన జువారి బన్ని తన బైక్తో ఎదురుగా ఢీకొన్నాడు. దీంతో రమేశ్కు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు గమనించి వెంటనే వరంగల్ తరలించారు. పరీక్షించిన వైద్యులు హైదరాబాద్కు రెఫర్ చేశారు. అక్కడ ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. మృతుడికి భార్య సుమలత, ముగ్గురు పిల్లలు ఉన్నారు. మృతుడి సోదరుడు వెంకన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఉపేందర్ తెలిపారు.