
కలెక్టర్ ప్రావీణ్యకు ఆత్మీయ వీడ్కోలు
కాజీపేట: వరంగల్ జిల్లాలో వివిధ హోదాల్లో పనిచేసిన అనుభవంతోపాటు ఈ ప్రాంత పరిచయాలు మరచిపోలేనివని హనుమకొండ కలెక్టర్ పి.ప్రావీణ్య అన్నారు. హనుమకొండ కలెక్టరేట్లో ఆదివారం రాత్రి అన్ని శాఖల అధికారులు సంగారెడ్డి కలెక్టర్గా బదిలీపై వెళ్తున్న ప్రావీణ్యకు ఆత్మీయ వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల నాయకులు.. కలెక్టర్ను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి వైవి. గణేశ్, ఆర్డీఓలు రమేశ్ రాథోడ్, డాక్టర్ నారాయణ, టీఎన్జీఓ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జగన్మోహన్ రావు, జిల్లా అధ్యక్షుడు ఆకుల రాజేందర్, జిల్లా ఖజానా అధికారి శ్రీనివాస్ కుమార్, తహసీల్దార్ బావుసింగ్ పాల్గొన్నారు.
ముగిసిన చెస్ పోటీలు
● బాలురలో అభివన్రెడ్డి,
బాలికల్లో శ్రీలాస్యకు ప్రథమ స్థానం
వరంగల్ స్పోర్ట్స్: వరంగల్ జిల్లా చదరంగ సమాఖ్య ఆధ్వర్యంలో హనుమకొండలోని టీటీడీ కల్యాణ మండపంలో ఆదివారం నిర్వహించిన ఉమ్మడి జిల్లా స్థాయి అండర్–13 బాలబాలికల చెస్ పోటీలు ముగిశాయి. ఉమ్మడి జిల్లా నుంచి 65 మంది క్రీడాకారులు పాల్గొన్నట్లు నిర్వహణ కార్యదర్శి పి. కన్నా తెలిపారు. బాలుర విభాగంలో అభినవ్రెడ్డి ప్రథమ స్థానం, సాయిజోషిత్ బొల్లం ద్వితీయస్థా నం, అల్లాడి శ్రీవాట్సన్ తృతీయ స్థానం, శ్రీసాయి ప్రీతం కనకాల నాల్గవ స్థానం సాధించారు. అలాగే, బాలికల విభాగంలో శ్రీలాస్య బోనాల, కంభంపాటి అస్మిత, పెండ్రు సాన్విక, కై రంకొండ సహస్క వరుస నాలుగు స్థానాల్లో నిలిచినట్లు తెలిపారు. ఈ ఎనిమిది మంది క్రీడాకారులు జూలైలో హైదరాబాద్లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. కార్యక్రమంలో ఆర్బిటర్లు శ్రీనివాస్, ప్రేమ్సాగర్ పాల్గొన్నారు.
ఆటో, బైక్ ఢీ.. ముగ్గురికి తీవ్రగాయాలు
గూడూరు: ఆటో ద్విచక్రవాహనం, ఢీకొన్న సంఘటనలో ముగ్గురికి తీవ్రగాయాలై పరిస్థితి విషమంగా మారిన ఘటన మండలంలోని మానుకోట వైపు దామరవంచ క్రాస్ జాతీయ రహదారిపై ఆదివారం రాత్రి జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. మండలంలోని ఏపూరుకు చెందిన బానోత్ తరుణ్, జాటోత్ హేమంత్, ధారావత్ యశ్వంత్ కలిసి ద్విచక్రవాహనంపై మానుకోట వెళ్లారు. తిరుగు ప్రయాణంలో దామరవంచ క్రాస్ వద్దకు చేరుకోగానే ఎదురుగా వచ్చిన ఓ ఆటో.. ద్విచక్రవాహనాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనంపై ఉన్న ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. 108లో గూడూరులో ప్రథమ చికిత్స అనంతరం వరంగల్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
రైలు ఢీకొని వృద్ధుడి దుర్మరణం
కాజీపేట రూరల్: కాజీపేట జీఆర్పీ పోలీస్స్టేషన్ పరిధిలోని హసన్పర్తి రైల్వే యార్డు సమీపంలో రై లు ఢీకొని మతిస్థిమితం లేని వృద్ధుడు ఆదివారం దుర్మరణం చెందాడు. కాజీపేట జీఆర్పీ సీఐ వి.నరేష్కుమార్ కథనం ప్రకారం.. హసన్పర్తి మండలం ఎల్లాపూర్ గ్రామం వినాయక వీధికి చెందిన కలవచర్ల రాజేంద్రం (76) ఆరు నెలల క్రితం మతిస్థిమితం కోల్పోయాడు. ఈ క్రమంలో ఆదివారం రైలు పట్టాల వైపు వెళ్లడంతో ఉప్పల్రైల్వే స్టేషన్ వైపు వెళ్లే రైలు ఢీకొని దుర్మరణం చెందాడు. మృతుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి మార్చురీలో మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించినట్లు సీఐ వివరించారు.

కలెక్టర్ ప్రావీణ్యకు ఆత్మీయ వీడ్కోలు

కలెక్టర్ ప్రావీణ్యకు ఆత్మీయ వీడ్కోలు