
కేయూలో ఎన్నికల సందడి..
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలో ఎన్జీఓ, క్లాస్ ఫోర్త్ అసోసియేషన్ల ఎన్నికల సందడి నెలకొంది. ఉద్యోగుల ప్రచారంతో క్యాంపస్ సందడిగా మారుతోంది. బరిలో ఉన్న వారు ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. వివిధ కార్యాలయాలు, ఇతర ప్రాంతాలకు వెళ్లి తమకు ఓటువేయాలని అభ్యర్థిస్తున్నారు. కాగా, ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. ఈ నేపథ్యంలో బరిలో ఉన్నవారి వివరాలు ఇలా ఉన్నాయి. కేయూ ఎన్జీఓ అసోసియేషన్ అధ్యక్ష పదవికి బి. నవీన్కుమార్, జి. నిరంజన్ పోటీపడుతుండగా వైస్ ప్రెసిడెంట్గా ఎండి. యూనస్, పి. భాస్కర్, జనరల్ సెక్రటరీ పదవికి వల్లాల తిరుపతి, సయ్యద్ అక్రం అహ్మద్, జాయింట్ సెక్రటరీ ఆర్గనైజేషన్ (జనరల్)కు ఎ. సతీశ్బాబు, బి. రాజు పోటీపడుతున్నారు. జాయింట్ సెక్రటరీ ఆర్గనైజేషన్ (ఉమెన్) బి. కృష్ణవేణి, గౌసియాబేగం, సిహెచ్. దేవమ్మ, జాయింట్ సెక్రటరీ ఆర్గనైజేషన్ (రిక్రియేషన్ )జి. మధుకర్, టి. ప్రభాకర్, పి. సుశీల్, ట్రెజరరీగా సిహెచ్. ప్రవీణ్కుమార్, టి. దామోదర్ పోటీపడుతున్నారు. విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎన్జీఓ కేటగిరీలోని ఉద్యోగులను కలిసి ఓటువేయాలని అభ్యర్థిస్తున్నారు. అంతేగాకుండా సామాజిక మాధ్యమాల ద్వారా కూడా ప్రచారం చేసుకుంటున్నారు. 222 మంది ఉద్యోగులు ఓటర్లుగా ఉన్నారు.
క్లాస్ఫోర్త్ ఎంప్లాయీస్ అసోసియేషన్..
కాకతీయ యూనివర్సిటీ క్లాస్ఫోర్త్ ఎంప్లాయీస్ ఎ న్నికల్లో వివిధ పదవులకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. ఈ నేపథ్యంలో బరిలో నిలి చిన వారి వివరాలు ఇలా ఉన్నాయి. అధ్యక్ష పదవికి పి. గుమ్మయ్య, ఎండి. నిజాముద్దీన్ పోటీ పడుతున్నారు. జాయింట్ సెక్రటరీ ఆర్గనైజేషన్ (జనరల్ ) ఎండి. వలిపాషా, టి. రాజేశ్వర్, జాయింట్సెక్రట రీ ఆర్గనైజేషన్ (రిక్రియేషన్) ఎన్. ఐలయ్య, పి. వే ణు, ట్రెజరరీ పదవికి టి. తరుమల్శ్రీనివాస్సింగ్, పి. రామనాథం పోటీ పడుతున్నారు. 79 మంది ఉ ద్యోగులు ఓటర్లుగా ఉన్నారు. ఈ రెండు అసోసియేషన్లకు ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ ఈనెల 20న 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నిర్వహించనున్నారు.ఈనెల 21న 11గంటలకు ఓట్ల లెక్కింపు ప్ర క్రియ ప్రారంభించి అదే రోజు ఫలితాలు వెల్లడిస్తా రు. ఈ అసోసియేషన్ల ఎన్నికల ప్రక్రియకు అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారిగా కేయూ అసిస్టెంట్ రిజిస్ట్రార్ పంజాల శ్రీధర్ వ్యవహరిస్తున్నారు.
ముగ్గురు ఏకగ్రీవం
క్లాస్ ఫోర్త్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఎన్నికల్లో జనరల్ సెక్రటరీ పదవికి ఒక్కరే నామినేషన్ వే సిన మొగిలి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షుడిగా అంకూస్, జాయింట్ సెక్రటరీ ఆర్గనైజేషన్ (ఉమెన్) మల్లికాంబ ఒక్కొక్కరే నామినేషన్ వేయడంతో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఎన్జీఓ, క్లాస్ ఫోర్త్ ఎంప్లాయీస్ అసోసియేషన్ల ఎన్నికలు
ముగిసిన నామినేషన్ల ప్రక్రియ
బరిలో నిలిచిన వారు పోటాపోటీ ప్రచారం
క్లాస్ ఫోర్త్లో ముగ్గురు ఏకగ్రీవం