
ఆయుర్వేదం మన సంపద
జనగామ: మన ఆయుర్వేద వైద్యాన్ని భవిష్యత్ తరాలకు అందించడంతోపాటు భారతీయ విజ్ఞానాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలని డీసీపీ రాజమహేంద్ర నాయక్ పిలుపునిచ్చారు. జనగామ వేద పంచకర్మ వెల్నెస్ సెంటర్, విశ్వ ఆయుర్వేద పరి షత్ తెలంగాణ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో వారం రోజులుగా జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న స్టేట్ లెవల్ ఆయుర్వేద కౌశలం–2025 సదస్సు ఆదివా రం ముగిసింది. వేద డాక్టర్ అంజిరెడ్డి అధ్యక్షతన జరిగిన ముగింపు సమావేశంలో డీసీపీ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఆయుర్వేద వైద్యం దేశ సంపద అన్నారు. నిత్య జీవితంలో ఆయుర్వేదాన్ని అనుసరిస్తూ, కాపాడుకోవాల్సిన బాధ్యత మ నపై ఉందన్నారు. గౌరవ అతిథి కల్నల్ మాచర్ల భిక్షపతి మాట్లాడుతూ వైజ్ఞానిక విశిష్టత, ప్రాచీన జ్ఞానం ఆధారంగా రోగ నివారణ సామర్థ్యాన్ని విశదీకరించారు. డాక్టర్ జ్ఞానేశ్వర్ మాట్లాడుతూ ఆరో గ్య పరిరక్షణలో ఆయుర్వేద వైద్యం ముఖ్యమో ప్రత్యక్షంగా తెలుసుకోవాలన్నారు. డాక్టర్ ప్రీతి ద యాల్.. పోలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్, హార్మోనల్ అసమతుల్యత గురించి వివరించారు. డాక్టర్ శరద్ కుమార్.. ఆయుర్వేద సిద్ధాంతాలను ప్రస్తుత కాలా నికి అనుగుణంగా ఎలా ఉపయోగించాలో అనే అంశంపై అవగాహన కల్పించారు. డెలిగేట్స్ ఐశ్వర్య, ఆదిలక్ష్మి ఆయుర్వేద కౌశలంలో నేర్చుకున్న అనుభవాలను పంచుకున్నారు. వేద ఆయుర్వేద పంచకర్మ వెల్నెస్ సెంటర్ను చూసిన తర్వాత తాము ఎంతో ప్రేరణ పొందామన్నారు. అనంతరం డీసీపీ చేతుల మీదుగా వైద్య విద్యార్థులు, అతిథులకు సర్టిఫికెట్లు అందించారు. కార్యక్రమంలో డాక్టర్లు ఎల్.కె.విరాజిత, సురేశ్ జకోత్యా, పూలే అనిల్, ఆర్య చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
భారతీయ విజ్ఞానాన్ని
ప్రపంచానికి చాటుదాం
డీసీపీ రాజమహేంద్ర నాయక్
ముగిసిన స్టేట్ లెవల్ ఆయుర్వేద
కౌశలం–2025 సదస్సు