చనిపోతూ ఇతరులకు ప్రాణం | - | Sakshi
Sakshi News home page

చనిపోతూ ఇతరులకు ప్రాణం

May 27 2025 1:05 AM | Updated on May 27 2025 1:05 AM

చనిపోతూ ఇతరులకు ప్రాణం

చనిపోతూ ఇతరులకు ప్రాణం

మహబూబాబాద్‌ రూరల్‌ : తాను చనిపోతూ ఓ యువకుడు ఇతరులకు తన అవయవాలు దానం చేసి ఆదర్శంగా నిలిచాడు. ఈ విషయం సోమవారం ఆలస్యంగా వెలుగు చూసింది. మహబూబాబాద్‌ మండలం చిన్నకృష్ణాపురం గ్రామానికి చెందిన అజ్మీరా మంగ్య, విజయ దంపతుల పెద్ద కుమారుడు రాజశేఖర్‌ (21) హైదరాబాద్‌లో డిగ్రీ థర్డ్‌ ఇయర్‌ చదువుతున్నాడు. ఈ క్రమంలో రాజశేఖర్‌ ఈ నెల 21వ తేదీన తన బైక్‌పై వెళ్తుండగా మరో వాహనం వచ్చి ఢీకొంది. ఈ ప్రమాదంలో రాజశేఖర్‌కు తీవ్ర గాయాలుకాగా వెంటనే ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా 23వ తేదీన బ్రెయిన్‌ డెడ్‌కు గురైనట్లు గుర్తించారు. దీంతో జీవన్‌ దాన్‌ ట్రస్ట్‌ నోడల్‌ అధికారి శ్రీభూషణ్‌ రాజు అతడి కుటుంబ సభ్యులకు అవయవదానంపై అవగాహన కల్పించారు. కొడుకుని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్నా మంగ్య, విజయ దంపతులు అతడి అవయవాలను దానం చేసేందుకు ముందుకు వచ్చారు. లివర్‌, కిడ్నీలు, కార్నియా దానం చేసి ఇతరులకు ప్రాణం పోశారు. దీంతో బాధిత కుటుంబ సభ్యులను ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ అభినందిస్తూ ఎక్స్‌లో ట్వీట్‌ చేశారు. గ్రామస్తులు అజ్మీరా వెంకన్న, కిశోర్‌, రవికుమార్‌, రమేశ్‌, భాస్కర్‌, సంత్రి, లచ్చు, సైదులు, బద్రి, వీరన్న, మంగి, శారద, బాలరాజు, మాజీ సర్పంచ్‌ గుగులోత్‌ రవి, తదితరులు రాజశేఖర్‌ మృతదేహాన్ని ఈ నెల 24వ తేదీన గ్రామంలో ఖననం చేశారు. మృతుడి పేరిట 12 అడుగుల స్తూపం నిర్మించనున్నట్లు గ్రామస్తులు తెలిపారు.

యువకుడి అవయవాలు దానం

మృతుడి తల్లిదండ్రుల ఔదార్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement