
పుష్కరాలకు వెళ్తూ...తిరిగిరాని లోకాలకు
కాటారం : పుష్కరాలకు వెళ్తూ ఓ వృద్ధురాలు తిరిగిరాని లోకాలకు చేరింది. కారు, తవేరా ఢీకొన్న ప్రమాదంలో దుర్మరణం చెందింది. ఈ ఘటన జయశంకర్భూపాలపల్లి జిల్లా కాటారం మండలం నస్తూర్పల్లి వద్ద జాతీయ రహదారి 353(సి)పై చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం హైదరాబాద్కు చెందిన సకోటి కిషన్లాల్, కడికె దుర్గాజీ కుటుంబ సభ్యులు, డ్రైవర్ మహేందర్ తవేరాలో పుష్కరాలకు బయలుదేరారు. సూర్యాపేట జిల్లా నేరేడుచర్లకు చెందిన లక్ష్మీనర్సింహారావు కుటుంబ సభ్యులు కాళేశ్వరంలో పుష్కర స్నానం ఆచరించి కారులో తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో కాటారం మండల కేంద్రానికి సమీపంలోకి రాగానే జాతీయ రహదారిపై కారు ముందు వెళ్తున్న మరో వాహనాన్ని ఓవర్టేక్ చేయబోయి ఎదురుగా వస్తున్న తవేరాను ఢీకొంది. దీంతో వాహనాలు నుజ్జునుజ్జయి రోడ్డుకు ఇరువైపులా దూసుకుపోయాయి. ఈ ఘటనలో తవేరాలో ప్రయాణిస్తున్న డ్రైవర్, పదిమంది భక్తులు, కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు భక్తులు వాహనాల్లోనే ఇరుక్కుపోయారు. అటువైపుగా వెళ్తున్న వాహనదారులలతో పాటు సమీపంలో అన్నదానం నిర్వహిస్తున్న కాంగ్రెస్ నాయకులు జేసీబీ సాయంతో వాహనాల డోర్లు తెరిచి క్షతగాత్రులను బయటకు తీశారు. తవేరాలో ప్రయాణిస్తున్న హైదరాబాద్కు చెందిన సకోటి లలిత(61) తీవ్రంగా గాయపడడంతో చికిత్స నిమిత్తం భూపాలపల్లి ఆస్పత్రికి తరస్తున్న క్రమంలో మార్గమధ్యలో మృతి చెందింది. అదే వాహనంలోని డ్రైవర్తో పాటు మరో తొమ్మిది మందికి గాయాలుకావడంతో హనుమకొండలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. కారులో ప్రయాణిస్తున్న ఓనర్ కమ్ డ్రైవర్ లక్ష్మీనర్సింహారావుతో పాటు మరో నలుగురికి గాయాలయ్యాయి. ఘటనా స్థలిని ఎస్సై మ్యాక అభినవ్, పీఎస్సై గీతారాథోడ్ పరిశీలించి వివరాలు సేకరించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వారు తెలిపారు.
కారు, తవేరా ఢీ..
వృద్ధురాలి దుర్మరణం
కాటారం ఫారెస్ట్ చెక్పోస్ట్ వద్ద ఘటన