
రైలు ఢీకొని ట్రాన్స్జెండర్ దుర్మరణం
ఖిలా వరంగల్: పట్టాలు దాటుతున్న క్రమంలో గుర్తుతెలియని రైలు ఢీకొనడంతో ఓ ట్రాన్స్జెండర్ మృతి చెందింది. ఈఘటన ఆదివారం వరంగల్ చింతల్ ప్లైఓవర్ అబ్బనికుంట మైసమ్మ దేవాలయం వద్ద చోటు చేసుకుంది. జీఆర్ పోలీసుల కథనం ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం బొల్లెపల్లి గ్రామం వడ్డెర కాలనీకి చెందిన ట్రాన్స్జెండర్ మిరియాల ఐశ్వర్య (35) వ్యక్తిగత పని నిమిత్తం చింతల్కు వచ్చింది. అనంతరం మైసమ్మ ఆలయ సమీపాన పట్టాలు దాటి వరంగల్ వైపు వెళ్తున్న క్రమంలో గుర్తుతెలియని రైలు ఢీకొనడంతో తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు గమనించి 108లో ఎంజీఎం తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం సికింద్రాబాద్ గాంధీకి తరలించగా చికిత్స పొందుతూ అదే రోజు సాయంత్రం మృతి చెందింది. వరంగల్ రైల్వే జీఆర్పీ హెడ్కానిస్టేబుల్ రాజు శవ పంచనామ నిర్వహించిన అనంతరం మృతురాలి తల్లి బొందమ్మకు ఐశ్వర్య మృతదేహం అప్పగించారు.