నేటి జీపీఓ పరీక్షకు సర్వం సిద్ధం | - | Sakshi
Sakshi News home page

నేటి జీపీఓ పరీక్షకు సర్వం సిద్ధం

May 25 2025 8:14 AM | Updated on May 25 2025 8:14 AM

నేటి జీపీఓ పరీక్షకు సర్వం సిద్ధం

నేటి జీపీఓ పరీక్షకు సర్వం సిద్ధం

మహబూబాబాద్‌ అర్బన్‌: గ్రామ పాలన అధికారి పరీక్షలకు సర్వం సిద్ధం చేయాలని కలెక్టర్‌ అద్వైత్‌కుమార్‌ సింగ్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలను శనివారం కలెక్టర్‌, అధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ నేడు (ఆదివారం) ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1.30 వరకు జరిగే గ్రామ పాలన అధికారి (జీపీఓ) పరీక్షకు 10,954 పోస్టులకు గాను జిల్లా నుంచి 152 మంది అభ్యర్థులు హాజరుకానున్నట్లు తెలిపారు. జిల్లాలో నోడల్‌ అధికారి ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని, పరీక్ష కేంద్రాలకు ఉదయం 8 గంటల వరకు జవాబు పత్రాలను, 9.20 గంటల వరకు ప్రశ్నపత్రాలను తరలించాలన్నారు. పరీక్షలు ముగిసిన తర్వాత జవాబు పత్రాలను సరిగ్గా సీల్‌ చేసి జేఎన్‌టీయూహెచ్‌కు తరలించాలన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద మౌలిక వసతులు కల్పించాలన్నారు. జిరాక్స్‌ షాపులు మూసివేయాలని, 144 సెక్షన్‌ అమలు చేయాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్‌ ఎ.రవీందర్‌ రెడ్డి, ఏఓ పవన్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి

మహబూబాబాద్‌: గ్రామ పాలన అధికారుల పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని సిసిఎల్‌ఏ కమిషనర్‌ నవీన్‌ మిట్టల్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం హైదరాబాద్‌ నుంచి సీసీఎల్‌ఏ కమిషనర్‌ నవీన్‌ మిట్టల్‌ గ్రామ పరిపాలన అధికారుల పరీక్షల నిర్వాహణపై జిల్లా కలెక్టర్‌లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

జిల్లాలో హాజరుకానున్న152 మంది అభ్యర్థులు

ఏర్పాట్లను పరిశీలించిన

కలెక్టర్‌ అద్వైత్‌కుమార్‌ సింగ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement