
అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లు
డోర్నకల్: కాంగ్రెస్ ప్రభుత్వానికి అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లులాంటివని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం రాకాసితండా నుంచి సీరోలు మండలం చిలుకొయ్యలపాడు వరకు రూ.3.75 కోట్లతో నిర్మిస్తున్న 1.8 కిలోమీటర్ల బీటీ రోడ్డు పనులకు శనివారం మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మారుమూల ప్రాంతంలోని రాకాసితండా, చిలుకొయ్యలపాడు మధ్య రోడ్డు నిర్మాణంతో రెండు నియోజకవర్గాల పరిధిలోని ప్రజలకు మేలు చేకూరుతుందన్నారు. అనంతరం పార్టీకి చెందిన బ్రోచర్ను నాయకులకు అందించారు. ఈ కార్యక్రమంలో సీరోలు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొండపల్లి కరుణాకర్రెడ్డి, నాయకులు ఊడ్గుల వీరన్న, లక్ష్మినారాయణ, బోడ రమేష్, వేల్పుల శ్రీను, బి.వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి