‘ఆడ’నే చిదిమేస్తున్నారు! | - | Sakshi
Sakshi News home page

‘ఆడ’నే చిదిమేస్తున్నారు!

May 25 2025 8:12 AM | Updated on May 25 2025 8:12 AM

‘ఆడ’న

‘ఆడ’నే చిదిమేస్తున్నారు!

సాక్షి, మహబూబాబాద్‌: ఆడ, మగ ఇద్దరు ఉంటేనే సృష్టి.. వంటింటి స్థాయి నుంచి దేశ సరిహద్దుల్లో కాపలా వరకు శత్రు దేశాన్ని గడగడలాడించే శక్తియుక్తులకు భారత మహిళలు నిదర్శనమని ఇటీవల ఆపరేషన్‌ సిందూర్‌తో రుజువు చేశారు. ఇంత జరిగినా సమాజంలో ఆడవారంటే తక్కువ చూపు పోవడం లేదు. ఆడపిల్లలు పుడుతున్నారని తెలియగానే తల్లి గర్భంలోనే చిదిమేస్తున్న సంఘటనలు జిల్లాలో చోటుచేసుకోవడం బాధాకరం. ఇందుకు నిదర్శనం పురుషుల నిష్పత్తితో పోలిస్తే సీ్త్రల నిష్పత్తి రాష్ట్రంలోనే మానుకోట కింది స్థాయికి దిగజారడం. అయితే ఈ పాపపు పనులు చేసే వారి సంఖ్య జిల్లాలో పెరిగిపోవడంతో ఇతర జిల్లాల నుంచి వచ్చి ఇక్కడ అబార్షన్లు చేయించుకుంటున్నానే ప్రచారం జిల్లాకు తలవంపులు తెచ్చేలా ఉంది.

ఇక్కడ ఇది సహజమే..

లింగనిర్ధారణ పరీక్షలు, గర్భవిచ్ఛిత్తి ఇతర ప్రాంతాల్లో అబ్బో అనే విషయాలు అయితే మహబూబాబాద్‌ జిల్లాలో సహజమే అన్నట్లు పేరుంది. గతంలో తొర్రూరు పట్టణంలోని ఓ ఆస్పత్రిలో గర్భ విచ్ఛిత్తి చేస్తున్న విషయం బట్టబయలు కావడంతో ఆ ఆస్పత్రిని సీజ్‌ చేశారు. కురవి మండలంలో ఓ ఆర్‌ఎంపీ ఈ పాపానికి ఒడిగడుతున్న విషయంపై కేసు అయ్యింది. నెల్లికుదురు మండలంలో మొబైల్‌ వాహనంలో స్కానింగ్‌ మిషన్‌ తీసుకువచ్చి లింగనిర్ధారణ పరీక్షలు చేస్తున్నారని తెలియడంతో చర్యలు తీసుకున్నారు. ఇటీవలి కాలంలో తొర్రూరు పట్టణంలో వరుస సంఘటనలు చోటుచేసుకున్నాయి. మహబూబాబాద్‌ పట్టణంలో మూడురోజుల క్రితం జరిగిన సంఘటనను అధికారులు స్వయంగా చూశారు. ముగ్గురిపై కేసు పెట్టినట్లు చె ప్పారు. కానీ ఇప్పటివరకు ఆయా ఆస్పత్రులపై చ ర్యలు తీసుకోలేదని విమర్శలు ఉన్నాయి. ఈ విషయాన్ని పీసీపీఎన్‌డీటీ సమావేశంలో బాధ్యులపై చ ర్య తీసుకోవాలని ముక్తకంఠంతో చెప్పినట్లు తెలి సింది. ఉన్నతాధికారుల నిర్ణయం ఎలా ఉంటుందోనని జిల్లా వాసులు ఎదురుచూస్తున్నారు.

రాష్ట్రంలో చివరి స్థానం..

రాష్ట్రంలోని 33 జిల్లాల్లో లింగ వ్యత్యాసంలో జిల్లా చివరిస్థానం(33)లో ఉంది. వెయ్యిమంది పురుషులకు గతంలో రూరల్‌ ఏరియాల్లో 996 మంది, అర్బన్‌ ఏరియాల్లో 1,035 మంది సీ్త్రలు సగటున 903 మంది ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. అయితే ఇటీవల దేశవ్యాప్తంగా నిర్వహించిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో లింగ నిష్పత్తి భారతదేశంలో 894, రాష్ట్రంలో 879 ఉండగా రాష్ట్రంలో అతి తక్కువగా మానుకోట జిల్లాలో 836 ఉన్నట్లు గుర్తించారు. జిల్లాలో 60శాతానికి పైగా జనాభా గిరిజన, ఆదివాసీలు ఉండటం, అక్షరాస్యత తక్కువగా ఉండటంతో మగ సంతానం కావాలనే ఆలోచనతో ఆడ, మగ అనే పరీక్షలు గర్భంలోనే గుర్తించి గుట్టుచప్పుడు కాకుండా విచ్ఛిన్నం చేయడమే మహిళల జనాభా తగ్గుదలకు కారణమని విమర్శలు వస్తున్నాయి.

విచారణ జరుగుతోంది..

లింగనిర్ధారణ పరీక్షలు చేయడం, భ్రూణహత్యలకు చేయడం చట్టరీత్య నేరం. ఎక్కడ జరిగినా సమాచారం ఇస్తే చర్యలు తీసుకుంటాం. మహబూబాబాద్‌లో జరిగిన సంఘటనపై కేసు నమోదు చేశారు. విచారణ జరుగుతోంది. పోలీసుల నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటాం.

– రవిరాథోడ్‌, జిల్లా వైద్యాధికారి

కఠినంగా శిక్షించాలి

జిల్లాలో వరుసగా భ్రూణహత్యల సంఘటనలు చోటుచేసుకోవడం బాధాకరం. ఇప్పటికే జిల్లాలో పురుషుల జనాభాతో పోలిస్తే సీ్త్ర జనాభా తక్కువగా ఉంది. ఇందుకు కారణం లింగనిర్ధారణ, అబార్షన్లు. ఈ పాపపు పనికి ఒడిగడుతున్న వారిని కఠినంగా శిక్షించాలి.

– నాగవాణి, సీడబ్ల్యూసీ చైర్‌పర్సన్‌

భ్రూణహత్యల కేంద్రంగా మానుకోట

గుట్టుచప్పుడు కాకుండా లింగనిర్ధారణ పరీక్షలు

ఇతర జిల్లాల నుంచి ఇక్కడికే..

వరుస సంఘటనలతో బట్టబయలు

మొక్కుబడిగా అధికారుల తనిఖీలు

కిందికి దిగజారిన మహిళల నిష్పత్తి

మహిళల సంఖ్య రోజురోజుకు తగ్గిపోతూ.. ప్రమాదకరంగా మారిందని జిల్లాలో లింగ నిష్పత్తి తగ్గడంపై నేషనల్‌ ఇనిస్టిస్ట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ కౌన్సిల్‌ సీరియస్‌గా పరిగణించింది. కేంద్ర బృందం జిల్లాలో పర్యటించింది. ప లు ఆస్పత్రులను తనిఖీలు చేసి నిబంధనలకు విరుద్ధంగా స్కానింగ్‌ సెంటర్ల నడుస్తున్నాయ ని హెచ్చరికలు కూడా జారీ చేసినట్లు ప్రచారం జరిగింది. ఇంత జరిగినా జిల్లా అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అధికారి మారినప్పుడల్లా తనిఖీల పేరిట హడాహుడీ చేయడం.. ఆ తర్వాత మౌనంగా ఉండటం పరిపాటిగా మారుతుంది. ఇక్కడ వణుకుజణుకు లేకుండా భ్రూణ హత్యలు చేస్తున్న విషయం ప్రచారం కావడంతో వరంగల్‌, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల నుంచి వచ్చి గు ట్టు చప్పుడు కాకుండా అబార్షన్లు చేయించుకొని పోతున్నట్లు ప్రచారం జరుగుతుంది.

‘ఆడ’నే చిదిమేస్తున్నారు! 1
1/1

‘ఆడ’నే చిదిమేస్తున్నారు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement