
రసాయన ఎరువుల వినియోగంతో భూసారానికి ముప్పు
● జిల్లా వ్యవసాయ అధికారి విజయనిర్మల
గార్ల: రసాయన ఎరువులు, పురుగుమందులు అ ధికంగా వినియోగించడంతో భూసారం దెబ్బ తిని, నేలలు చౌడుబారి పంటల్లో దిగుబడులు తగ్గుతా యని జిల్లా వ్యవసాయ అధికారి విజయనిర్మల సూ చించారు. శుక్రవారం గార్లలోని రైతువేదిక భవనంలో జరిగిన రైతు సదస్సులో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. సేంద్రియ ఎరువులు, జీలుగ సాగుతో భూసారం పెరగడంతో పాటు, భూముల్లో నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతుందన్నారు. ఈ సదస్సులో మల్యాల శాస్త్రవేత్తలు క్రాంతికుమార్, కిషోర్కుమార్, ఏడీఏ శ్రీనివాసరావు, ఏఓ కావటి రామారావు, రాజు, ఏఈఓలు పాల్గొన్నారు.