అన్నారం బరాజ్‌ను పరిశీలించిన ఈఎన్‌సీ జనరల్‌ | - | Sakshi
Sakshi News home page

అన్నారం బరాజ్‌ను పరిశీలించిన ఈఎన్‌సీ జనరల్‌

May 23 2025 5:31 AM | Updated on May 23 2025 5:31 AM

అన్నారం బరాజ్‌ను పరిశీలించిన ఈఎన్‌సీ జనరల్‌

అన్నారం బరాజ్‌ను పరిశీలించిన ఈఎన్‌సీ జనరల్‌

కాళేశ్వరం: జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ మండలం అన్నారం బరాజ్‌ను ఇరిగేషన్‌శాఖ ఈఎన్‌సీ జనరల్‌ అనిల్‌కుమార్‌ గురువారం పరిశీలించారు. ఎన్‌డీఎస్‌ఏ ఇచ్చిన తుది నివేదిక ప్రకారం బరాజ్‌లో కొన్ని పరీక్షలు చేయాల్సి ఉందని, డౌస్‌ సీమ్‌, అప్‌ సీమ్‌లో పేరుకుపోయిన ఇసుకను తొలిగించి పరీక్షలు ప్రారంబించాలని ఆదేశించారు. ఓఅండ్‌ఎం నిర్వహణ పూర్తయిన నేపథ్యంలో బరాజ్‌ను పూర్తిస్థాయిలో పరిశీలించి సూచనలు, సలహాలు ఇచ్చారు. ఆయన వెంట సీఈ సుధాకర్‌రెడ్డి, ఎస్‌ఈ సత్యనారాయణ, ఈఈ యాదగిరి, ఇంజనీర్లు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement