
నేడు‘డయల్ యువర్ డీఎం’
నెహ్రూసెంటర్: మహబూబాబాద్ ఆర్టీసీ డిపో ఆధ్వర్యంలో నేడు (శుక్రవారం) ‘డయల్ యువర్ డీఎం’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు డిపో మేనేజర్ ఎం.శివప్రసాద్ గురువారం తెలిపారు. మధ్యాహ్నం 3నుంచి 4 గంటల వరకు కార్యక్రమం కొనసాగుతుందన్నారు. ఆర్టీసీ అభివృద్ధికి సలహాలు, సూచనలు ఇచ్చేందుకు ప్రజలు, ప్రయాణికులు 85003 24880 నంబర్కు ఫోన్ చేయాలన్నారు.
నిర్మాణ పనులు
వేగవంతం చేయాలి
● ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్
మహబూబాబాద్: కూరగాయాల మార్కెట్ నిర్మాణ పనులు వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్ ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని మోడల్ మార్కెట్ నిర్మాణ పనులను గురువారం పరిశీలించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజల సౌకర్యార్థం కూరగాయలు, పండ్లు, మాంసం, చేపలు ఇలా అన్ని ఒకే ప్రాంతంలో అందుబాటులో ఉండాలని మోడల్ మార్కెట్ పనులు పూర్తి చేయిస్తున్నామన్నారు. ల్ మార్కెట్ను త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. ట్రాఫిక్ సమస్య లేకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో డీఈ సీహెచ్ఉపేందర్, నాయకులు ఎడ్ల రమేశ్, ఖలీలు పాల్గొన్నారు.
ఇళ్ల నిర్మాణ పనుల పరిశీలన
కేసముద్రం: ఇనుగుర్తి మండలంలోని పాతతండాజీపీలో చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో గురువారం పరిశీలించారు. పనులను త్వరిగతిన పూర్తిచేయాలని ఆయన ఆదేశించారు. కార్యక్రమంలో తహసీల్దార్ రవీందర్, కార్యదర్శి అశోక్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కూరెల్లి సతీష్ పాల్గొన్నారు.
కొనుగోళ్లలో
వేగం పెంచాలి
పెద్దవంగర: ధాన్యం కొనుగోళ్లలో మరింత వేగం పెంచాలని జిల్లా సివిల్ సప్లయీస్ అధికారి ప్రేమ్కుమార్, డీపీఎం నళినినారాయణ అన్నారు. గురువారం మండలంలోని ఐకేపీ, పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పలు ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ధాన్యం తరలింపునకు మండలంలో 120 లారీలను కేటాయించినట్లు పేర్కొన్నారు. ధాన్యం తరలింపులో రవాణా ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం తడవకుండా సెంటర్ నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. గన్నీ సంచులు అందుబాటులో ఉన్నాయని, రైతులు అధైర్య పడొద్దని ప్రతి గింజనూ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్ మహేందర్, ఏఓ స్వామి నాయక్, ఏపీఎం రమణాచారి, పీఏసీఎస్ సీఈఓ మురళి తదితరులు పాల్గొన్నారు.
పాలిటెక్నిక్ కాలేజీకి నాలుగు కోర్సులు
కేసముద్రం: కేసముద్రం పట్టణ కేంద్రంలో ఇటీవల మంజూరైన పాలిటెక్నిక్ కాలేజీలో నాలుగు కోర్సులను ప్రవేశపెడుతూ ఉన్నత విద్య ప్రిన్సిపల్ సెక్రటరీ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) అండ్ మిషిన్ లెర్నింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అండ్ ఎలక్ట్రిక్ వెహికిల్ టెక్నాలజీ, ఎంబీడెడ్ సిస్టం కోర్సులు ఉన్నట్లు పేర్కొన్నారు. కాగా పాలిటెక్నిక్ కాలేజీని మున్సిపాలిటీ పరిధిలోని కేసముద్రంస్టేషన్ జెడ్పీ హైస్కూల్లో తాత్కాలికంగా ఏర్పాటు చేశారు. కాగా 2025–26 విద్యాసంవత్సరం నుంచి పాలిటెక్నిక్ కాలేజీలో నాలుగు కోర్సుల్లో విద్యాబోధన జరగనుంది.

నేడు‘డయల్ యువర్ డీఎం’

నేడు‘డయల్ యువర్ డీఎం’