
‘సాక్షి’ ఎడిటర్ ఇంటిపై దాడి అమానుషం
నెహ్రూసెంటర్: సాక్షి దినపత్రిక ఎడిటర్ ధనంజయరెడ్డి విజయవాడలోని నివాస గృహంపై ఏపీ పోలీసులు చేసిన దాడిని నిరసిస్తూ గురువారం మహబూబాబాద్ పట్టణంలో నిరసన ర్యాలీ, రాస్తారోకో నిర్వహించారు. జర్నలిస్టు సంఘాల నాయకులు, కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ, బీఆర్ఎస్తో పాటు ఎల్హెచ్పీఎస్, సేవాలాల్ సేన, కేవీపీఎస్, మా అసోసియేషన్, వికలాంగ సంఘం నాయకులు నల్లబ్యాడ్జీలు ధరించి స్థానిక తహసీల్దార్ కార్యాలయం నుంచి ర్యాలీగా బయల్దేరి ముత్యాలమ్మ సెంటర్ మీదుగా అంబేడ్కర్ సెంటర్కు చేరుకుని రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘాల నాయకులు మాట్లాడుతూ.. సాక్షి దినపత్రిక ఎడిటర్ ధనంజయరెడ్డి ఇంటిపై ఏపీ పోలీసులు చేసిన దాడులు అమానుషమన్నారు. ఏపీ పోలీసులు కక్షపూరితంగా వ్యవహరిస్తూ పత్రిక స్వేచ్ఛకు భంగం కలిగిస్తున్నారన్నారు. నిజాలను నిర్భయంగా రాసే పత్రికల గొంతునొక్కే ప్రయత్నం చేస్తే మేధావులు, ప్రజాస్వామిక వాదులు సహించబోరని వారు హెచ్చరించారు. కార్యక్రమంలో సీపీఐ నాయకులు పెరుగు కుమార్, రేషపల్లి నవీన్, చింతకుంట్ల వెంకన్న, వెలుగు శ్రావణ్, బానోత్ లింగ్యానాయక్, సీపీఎం నాయకులు సమ్మెట రాజమౌళి, దుడ్డెల రాంమూర్తి, మంద శంకర్, మా అసోసియేషన్ అధ్యక్షుడు బొడ్డుపల్లి ఉపేంద్రం, కాంగ్రెస్ నాయకులు గుగులోతు రాములునాయక్, ఇనుగుర్తి సుధాకర్, పద్మం ప్రవీణ్కుమార్, అంజాద్, శ్రీను, జన్నారపు విక్రమ్, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ నాయకులు హెచ్.లింగ్యా, గుజ్జు దేవేందర్, బీఆర్ఎస్ నాయకుడు మందుల రఘు, ఎల్హెచ్పీఎస్ నాయకులు గుగులోత్ భీమనాయక్, మంగీలాల్, సేవాలాల్ సేన నాయకుడు ధరావత్ వెంకన్ననాయక్, జర్నలిస్టు సంఘం నాయకులు సీహెచ్.ఉదయ్ధీర్, పద్మం మహేశ్, ఆకుల నవీన్, పసుపులేటి వెంకటేశ్వర్లు, లక్ష్మణ్, విద్యార్థి సంఘాల నాయకులు గుగులోత్ సూర్యప్రకాశ్, కేలోత్ సాయికుమార్, ఇరుగు మనోజ్కుమార్, పాషా, శంకర్, ఫజల్, దాసరి సారయ్య, శివవర్మ, సాక్షి జర్నలిస్టులు ఈరగాని బిక్షం, అర్రం రమేశ్చందర్, బోనగిరి శ్రీనివాస్, ఇరుకుల్ల కిరణ్కుమార్, జిల్లెలమూడి మురళిమోహన్, చింతకుంట్ల యాకాంబ్రం తదితరులు పాల్గొన్నారు.
ఖండించిన జర్నలిస్టు సంఘాలు,
పార్టీల నాయకులు, కుల సంఘాలు
మహబూబాబాద్ పట్టణంలో
నల్లబ్యాడ్జీలు ధరించి ర్యాలీ
అంబేడ్కర్ సెంటర్లో నిరసన