
తలసేమియా వ్యాధిగ్రస్తులకు అండగా ఉండాలి
నెహ్రూసెంటర్: తలసేమియా వ్యాధిగ్రస్తులకు అండగా ఉండాలని డీఎంహెచ్ఓ రవిరాథోడ్ అన్నారు. గురువారం ప్రపంచ తలసేమియా దినోత్సవం సందర్భంగా జీజీహెచ్ నుంచి ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. డీఎంహెచ్ఓ రవిరాధోడ్, జీజీహెచ్ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. జిల్లాలో 167 మంచి చిన్నారులు తలసేమియా వ్యాధితో బాధపడుతున్నారని ఇది ఒక జన్యుసంబంధిత వ్యాధి అన్నారు. వ్యాధితో బాధపడేవారు, కుటుంబ సభ్యులు జన్యు పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. నెలల వయస్సులోనే వ్యాధి లక్షణాలను మనం గుర్తించవచ్చన్నారు. వ్యాధితో బాధపడుతున్న కుటుంబ సభ్యులు వివాహం చేసుకోవాలకుంటే తప్పనిసరిగా తలసేమియా స్క్రీనింగ్ చేయించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారులు సారంగం, సుధీర్రెడ్డి, శ్రవణ్, రవీందర్, అనిత, జిల్లా డిప్యూటీ మాస్ మీడియా అధికారి కొప్పు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
డీఎంహెచ్ఓ రవిరాథోడ్