ప్రజలకు అవగాహన కల్పించాలి | - | Sakshi
Sakshi News home page

ప్రజలకు అవగాహన కల్పించాలి

May 8 2025 9:15 AM | Updated on May 8 2025 9:15 AM

ప్రజలకు అవగాహన కల్పించాలి

ప్రజలకు అవగాహన కల్పించాలి

నెహ్రూసెంటర్‌: ఎండల తీవ్రతపై ప్రజలకు అవగాహన కల్పించాలని డీఎంహెచ్‌ఓ రవిరాథోడ్‌ అధికారులకు సూచించారు. జిల్లా వైద్యారోగ్యశాఖ కార్యాలయంలో బుధవారం ప్రోగ్రాం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ.. ఎండల తీవ్రత పెరుగుతుందని, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు వివరించాలన్నారు. ఉపాధి కూలీలకు ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు అందజేయాలన్నారు. రానున్న వానాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై యాక్షన్‌ప్లాన్‌ సిద్ధం చేయాలని సూచించారు. ప్రతి మండలంలో ర్యాపిడ్‌ యాక్షన్‌ టీంలను ఏర్పాటు చేయాలని ప్రోగ్రాం అధికారులను ఆదేశించారు. ఫార్మసీ అధికారులు, ల్యాబ్‌ టెక్నీషియన్లు, డాటా ఎంట్రీ ఆపరేటర్లతో నిర్వహించిన సమావేశంలో డీఎంహెచ్‌ఓ మాట్లాడారు. మందులు ఇస్తున్నప్పుడు గడువు తేదీని ఫార్మసిస్టులు చూసుకోవాలని, పీహెచ్‌లలోని టెక్నీషియన్లు అవసరమైన వారికి శాంపిల్స్‌ తీసి టీహబ్‌కు పంపించాలని సూచించారు. సమావేశంలో ప్రోగ్రాం అధికారులు సారంగం, సుధీర్‌రెడ్డి, నాగేశ్వర్‌రావు, లక్ష్మీనారాయణ, విజయ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement