
చదువుల కోటగా తీర్చిదిద్దాలి
మహబూబాబాద్ అర్బన్: మానుకోట జిల్లాను చదువుల కోటగా తీర్చిదిద్దాలని ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు అన్నారు. పదో తరగతిలో ఫలితాల్లో రాష్ట్రంలోనే జిల్లా ప్రథమస్థానంలో సాధించినందుకు కలెక్టర్ అద్వైత్ కుమార్సింగ్, డీఈఓ రవీందర్రెడ్డిని ఎమ్మెల్సీ రవీందర్రావు బుధవారం కలెక్టరేట్లో సన్మానించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లెనిన్వత్సల్ టొప్పో, మున్సిపల్ మాజీ చైర్మన్ రామ్మోహన్రెడ్డి, మాజీ వైస్ చైర్మన్ మార్నేని వెంకన్న, నాయకులు దౌలగర్ శంకర్, రఘు, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.