నెల్లికుదురు: ద్విచక్రవాహనాన్ని ట్రాక్టర్ ఢీకొట్టిన ఘటనలో ఒకరు మృతి చెందిన ఘటన మండలంలోని సంధ్య తండా పరిధిలో గురువారం చోటు చేసుకుంది. ఎస్సై రమేష్ బాబు తెలిపిన వివరాల ప్రకారం.. సిరోలు మండలం కాంపల్లి గ్రామానికి చెందిన పులసాని విష్ణువర్ధన్రెడ్డి (40) ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేసుకుంటూ కుటుంబంతో కలసి హైదరాబాద్లో ఉంటున్నాడు. ఈక్రమంలో హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి వెళ్లున్నాడు.
అదేసమయంలో నెల్లికుదురు మండలం కాస్యతండాకు చెందిన బానోతు లక్ష్మణ్ వరి గడ్డిని ట్రాక్టర్లో వెడల్పుగా లోడు చేసుకుని నెల్లికుదురు వైపునకు అజాగ్రత్తగా నడుపుతూ రాంగ్ రూట్లో వచ్చి మండలంలోని సంధ్య తండా పరిధిలోని నెల్లికుదురు మహబూబాబాద్ ప్రధాన రహదారిపై విష్ణువర్ధన్రెడ్డి బైక్ను ఢీకొట్టాడు. దీంతో విష్ణువర్ధన్రెడ్డి తలకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు 108 అంబులెన్స్లో ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందాడని నిర్ధారించారు. మృతుడి తల్లి పులసాని రజిత ఫిర్యాదుల మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
రెండు మోటార్ సైకిళ్లు ఢీకొని మరొకరు..
రెండు ద్విచక్రవాహనాలు ఢీ కొనడంతో ఒకరు మృతి చెందిన ఘటన మహబూ బాబాద్ జిల్లా నెల్లికుదురు మండలంలోని మునిగలవీడు గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్సై చిర్ర రమేశ్బాబు గురువారం తెలిపిన వివరాల ప్రకారం.. మునిగలవీడు గ్రామానికి చెందిన ఉప్పరబో యిన పరశురాములు (59) ఏప్రిల్ 25న తన టీవీ ఎస్ ఎక్సల్ మోటార్ సైకిల్పై మహబూబాబాద్ వైపునకు వెళ్లుండగా.. మండలంలోని శ్రీరామగిరి గ్రామానికి చెందిన మందుల వెంకన్న తన బైక్పై నెల్లికుదురు వైపు నుంచి శ్రీరామగిరి గ్రామానికి వెళ్తూ రాంగ్ రూట్లో పరశురాములు ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టాడు.
దీంతో ఇరువురు తీవ్రంగా గాయపడగా.. ఆస్పత్రికి తరలించారు. పరశురాములు పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్లోని నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఈక్రమంలో అక్కడ చికిత్స పొందుతూ పరశురాములు మృతి చెందాడని మృతుడి బాబాయి ఈర వెంకటేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెల్లడించారు.