టైక్స్‌టైల్‌ పార్క్‌ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి | - | Sakshi
Sakshi News home page

టైక్స్‌టైల్‌ పార్క్‌ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి

Apr 5 2025 1:24 AM | Updated on Apr 5 2025 1:24 AM

టైక్స్‌టైల్‌ పార్క్‌ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి

టైక్స్‌టైల్‌ పార్క్‌ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి

పరకాల: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిసారించారని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల, పురపాలక శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్‌బాబు అన్నారు. టెక్స్‌టైల్‌ పార్కులో మంజూరు చేసిన అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను మంత్రి శ్రీధర్‌బాబు, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి ఆదేశించారు. పరకాల మున్సిపల్‌ సమావేశమంది రంలో పరకాల ఎమ్మెల్యే ప్రకాశ్‌రెడ్డి అధ్యక్షతన కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌ అభివృద్ధి పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌లోని ఇండస్ట్రీలో స్థానికులకే ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో ప్రాధాన్య త ఇవ్వాలని, అందుకు స్కిల్‌ ట్రైనింగ్‌ సెంటర్ల ద్వా రా స్థానికులకు నైపుణ్యం కల్పించి నియమించుకో వాలని సూచించారు. ఆర్‌అండ్‌బీ లే అవుట్‌లో పట్టాలిచ్చిన 863 మంది రైతులకు వారి అభ్యర్థన మేరకు 50 గజాల నుంచి 75 గజాలు అందించేందుకు టీజీఐఐసీ ద్వారా అదనంగా రెండు ఎకరాల భూమి కేటాయించినట్లు తెలిపారు. తిరిగి లేఅవుట్‌ ప్లాట్లు చేసి రాజీవ్‌ గాంధీ టౌన్‌ షిప్‌ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఎంఎస్‌ఎంఈ జీడీపీ పథకం ద్వారా రూ.10.10 కోట్ల వ్యయంతో చేపట్టిన కనీస మౌలిక వసతులైన రోడ్లు, డ్రైన్స్‌, మంచినీటి సరఫరా, సంప్‌, పరిపాలన భవన నిర్మాణం పనులు పురోగతిలో ఉన్నాయని, జూలై 2025 నాటికి పూర్తవుతాయని అధికారులు మంత్రికి వివరించారు.

గంజాయి, గుడుంబా నివారణకు చర్యలు

టైక్స్‌టైల్‌ పార్క్‌లో పనిచేస్తున్న ఇతర రాష్ట్రాల కూలీలు గంజాయి సేవిస్తున్నట్లు సమాచారం ఉందని అలాంటి కార్యకలాపాలపై పోలీసులు దృష్టిసారించాలని ఎమ్మెల్యే ప్రకాశ్‌రెడ్డి కోరారు.

రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి

శ్రీధర్‌బాబు

కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌

అభివృద్ది పనుల పురోగతిపై

అధికారులతో సమీక్ష సమావేశం

కుట్టు శిక్షణ కేంద్రం ప్రారంభం

పరకాల నియోజకవర్గ కేంద్రానికి మంజూరైన కుట్టు శిక్షణ కేంద్రాన్ని మంత్రి శ్రీధర్‌బాబు ప్రారంభించారు. అనంతరం నియోజకవర్గంలో ని నాలుగు మండలాల్లో ఏర్పాటు చేసిన శిక్షణ కేంద్రాల ద్వారా 51 బ్యాచ్‌లలో 1,717 మంది మహిళలకు శిక్షణ ఇచ్చి, శిక్షణ పూర్తి చేసుకున్న 82 మంది మహిళలకు మంత్రి చేతుల మీదుగా అపాయింట్‌మెంట్‌ పత్రాలు అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement