భక్తిశ్రద్ధలతో పుష్పోత్సవం | - | Sakshi
Sakshi News home page

భక్తిశ్రద్ధలతో పుష్పోత్సవం

Mar 7 2025 9:39 AM | Updated on Mar 7 2025 9:35 AM

కురవి: భద్రకాళీ సమేత శ్రీ వీరభద్రస్వామి కల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి భక్తి శ్రద్ధలతో పుష్పోత్సవం (పవళింపు సేవ) కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు నిర్వహించారు. ఆలయ ఆవరణలో ప్రత్యేకంగా అలంకరించిన వేదికపై భద్రకాళీ సమేత వీరభద్రస్వామి ఉత్సవమూర్తులను అదీష్టింప చేసి గణపతి పూజ, గౌరీపూజ, పుణ్యహవచనము నిర్వహించి పుష్పోత్సవాన్ని నిర్వహించారు. అనంతరం ఆలయ మండపంలోని పూలతో అలంకరించిన ఊయల వద్దకు మేళతాళాల నడుమ ఉత్సవమూర్తులను తోడ్కోని వెళ్లి పవళింపు సేవను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ సత్యనారాయణ, మహబూబాబాద్‌ డీఎస్పీ తిరుపతిరావు, సీఐ సర్వయ్య దంపతులు, ఆలయ చైర్మన్‌ కొర్ను రవీందర్‌రెడ్డి దంపతులు, ఆలయ ధర్మకర్త చిన్నం గణేష్‌, బాలగాని శ్రీనివాస్‌, అర్చకులు రెడ్యాల శ్రీనివాస్‌, పెనుగొండ అనిల్‌కుమార్‌, దూసకంటి విజయ్‌, పుణ్యమూర్తి, విజయ్‌, అభిలాష్‌, తేజ, బాలకృష్ణ, శ్రీకాంత్‌, రమేశ్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement