
1972 వరకు ములుగు జనరల్.. 1978లో ఎస్టీకి కేటాయింపు
● 1952లో ఏర్పడిన నియోజకవర్గ ప్రస్థానం ఇదీ..
● ఎక్కువ సార్లు గెలిచిన పార్టీలు కాంగ్రెస్, టీడీపీ
● 50,079 నుంచి 2,20,886 వరకు పెరిగిన ఓటర్లు
● కీలకంగా మారనున్న మహిళా ఓట్లు
ములుగు: ములుగు నియోజకవర్గంలో 1952లో తొలిసారి శాసన సభ ఎన్నికలు జరిగాయి. ఇందులో పీడీఎఫ్(పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్) తరఫున హనుమంతరావు, కాంగ్రెస్ తరఫున రాజ్యలక్ష్మీ పోటీ చేశారు. ఇందులో రాజ్యలక్ష్మీకి కేవలం 6,540 ఓట్లు మాత్రమే వచ్చాయి. పీడీఎఫ్ అభ్యర్థి హనుమంతరావుకు 7,132 పోలై ములుగు తొలి ఎమ్మెల్యేగా రికార్డుల్లోకి ఎక్కారు. 1972 వరకు ములుగు జనరల్గా ఉంది. ఎస్టీ జనాభా ఎక్కువ ఉండడంతో డిలిమిటేన్లో భాగంగా 1978లో ఎస్టీ రిజర్వ్గా మారింది.
ఎక్కువ సార్లు గెలిచిన పార్టీలు కాంగ్రెస్, టీడీపీ
ములుగు నియోజకవర్గంలో ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీలే ఎక్కువసార్లు గెలుపొందాయి. కాగా టీడీపీ ప్రభుత్వంలో అజ్మీర చందూలాల్, పోరిక జగన్నాయక్ రెండుసార్లు మంత్రులుగా కొనసాగారు. ఇక 2014 ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి అజ్మీర చందూలాల్.. కాంగ్రెస్ అభ్యర్థి సీతక్కపై 18,884 ఓట్లతో గెలుపొందారు. అనంతరం 2018 ఎన్నికల్లో ఏకంగా సిట్టింగ్ మంత్రి చందూలాల్పై 22,671 ఓట్లతో గెలుపొందారు.
భారీగా పెరిగిన ఓట్లర్లు..
1952 మొదలు.. 2023 సంవత్సరం వరకు 71 సంవత్సరాల్లో నియోజకవర్గ ఓటర్ల సంఖ్య భారీగా పెరుగుతూ వచ్చింది. 1952తొలి ఎన్నికల్లో 50,076 మంది ఓటర్లు మాత్రమే ఉండగా 1985లో తొలిసారి 1,09,680 మొదటిసారి లక్ష సంఖ్య దాటింది. 1999లో 1,61,863 వరకు వచ్చింది. ఇక 2014లో రెండు లక్షలు దాటింది. ప్రస్తుతం నియోజకవర్గంలో 2,20,886 మంది ఓటర్లు ఉన్నారు.
ప్రభావం చూపనున్న మహిళా ఓటర్లు
2009 నుంచి ములుగు నియోజకవర్గంలో మహిళా ఓటర్ల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఈ సాధారణ ఎన్నికల్లో 1,08,588 మంది పురుషులు, 1,12,277 మంది మహిళలు ఓటు హక్కు వినియోగించనున్నారు. ఈ లెక్కన నియోజకవర్గంలోని 10 మండలాల్లో (మల్లంపల్లి నూతన) 3,089 మంది మహిళలు ఎక్కువగా ఉన్నారు.
2009లో మారిన నియోజకవర్గ ముఖ చిత్రం
2009 సాధారణ శాసనసభ ఎన్నికల్లో ఒక్కసారి ములుగు నియోజకవర్గ ముఖచిత్రం పూర్తిగా మారింది. గతంలో నియోజకవర్గంలో ఉన్న గణపురం అలాగే కొనసాగితే ములుగు జనరల్ అయ్యే అవకాశం ఉండేది. అదే విధంగా ప్రస్తుత మహబూబాబాద్ జిల్లాలో ఉన్న కొత్తగూడను నర్సంపేట నియోజకవర్గంలో కొనసాగిస్తే నర్సంపేట సైతం ఎస్టీగా కొనసాగేది. అయితే రేవూరి ప్రకాశ్రెడ్డి, ములుగు ఎమ్మెల్యే పొదెం వీరయ్య అంతర్గతంగా స మావేశమై పరిస్థితిని తారుమారు చేశారు. రిజర్వేషన్లు మారకుండా నల్లబెల్లిని నర్సంపేటలో, కొత్తగూడను ములుగులో, గణపురం(ఎం)ను జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కలిపారు. దీంతో ములుగు ముఖచిత్రం మారి ఎస్టీ రిజర్వ్ అయింది.
నియోజకవర్గంలో పోటీ చేసిన వారి వివరాలు
సంవత్సరం గెలుపొందిన అభ్యర్థి సమీప అభ్యర్థి పోలైన ఓట్లు
పార్టీ
1952 పీడీఎఫ్ హనుమంతరావు రాజ్యలక్ష్మీ(కాంగ్రెస్) 23,869
1957 పీడీఎఫ్ రాజేశ్వర్రావు కులు(కాంగ్రెస్) 28,865
1962 కాంగ్రెస్ కృష్ణయ్య ప్రసాద్(సీపీఐ) 39,141
1967 ఇండిపెండెంట్ సంతోశ్ చక్రవర్తి రామనర్సయ్య(సీపీఎం) 52,379
1972 కాంగ్రెస్ సంతోశ్ చక్రవర్తి రావు(ఇండిపెండెంట్) 66,755
1978 కాంగ్రెస్ జగన్నాయక్ భోజరావు(జనతా) 64,320
1983 కాంగ్రెస్(ఐ) జగన్నాయక్ అజ్మీర చందూలాల్(టీడీపీ) 64,474
1985 టీడీపీ చందూలాల్ జగన్నాయక్(కాంగ్రెస్) 74,599
1989 కాంగ్రెస్ జగన్నాయక్ చందూలాల్(టీడీపీ) 1,02,475
1994 టీడీపీ చందూలాల్ జగన్నాయక్(కాంగ్రెస్) 1,13,849
1996 టీడీపీ భోజారావు జగన్నాయక్(కాంగ్రెస్) –
1999 కాంగ్రెస్ వీరయ్య చందూలాల్(టీడీపీ) 1,15,227
2004 కాంగ్రెస్ వీరయ్య సీతక్క(టీడీపీ) 1,18,383
2009 టీడీపీ సీతక్క పొదెం వీరయ్య(కాంగ్రెస్) 1,34,674
2014 బీఆర్ఎస్ చందూలాల్ సీతక్క(టీడీపీ) –
2018 కాంగ్రెస్ సీతక్క చందూలాల్(బీఆర్ఎస్) 1,68,780
ములుగు నియోజకవర్గ కేంద్రం




