
టీబీ నివారణకు పటిష్ట చర్యలు
కర్నూలు (సెంట్రల్): జిల్లాలో టీబీ (క్షయ) నివారణకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు నేషనల్ హెల్త్ మిషన్ అడిషనల్ సెక్రటరీ ఆరాధన పట్నాయక్కు జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా వివరించారు. బుధవారం సాయంత్రం ఆమె ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా టీబీ ముక్త్ భారత్పై అన్ని జిల్లాల కలెక్టర్లతో సమీక్షించారు. అందులో భాగంగా కర్నూలు జిల్లాలో టీబీ నివారణ చర్యలను కలెక్టర్ ఆమెకు వివరించారు. 2,500 మంది టీబీ వ్యాధిగ్రస్తులకు న్యూట్రిషన్ కిట్స్, మందులను అందజేస్తున్నట్లు వివరించారు.