
రాకపోక.. నరకయాతన
ప్రభుత్వం స్పందించాలి
ఇలాంటి విషయాల్లో ప్రభుత్వం స్పందించాలి. పక్కన కర్ణాటకలో ఇలాంటి పరిస్థితి లేదు. అక్కడ వెంటనే స్పందించి మరమ్మతులు చేపడుతారు. ఇక్కడ చానా కష్టంగా ఉంది. ప్రభుత్వం వెంటనే స్పందించి వంతెన నిర్మాణం పూర్తి చేయాలి. –మహదేవి
దారుణ పరిస్థితి
మా పొలాలు కుంబళనూరు ప్రాంతంలో ఉన్నాయి. నాది గొతులదొడ్డి గ్రామం. పొలం పనికి రావాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. ఇంతటి దారుణ పరిస్థితి ఎప్పుడూ లేదు. –వెంకటేష్
కౌతాళం: కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంత పల్లెలకు కర్ణాటక రాష్ట్రంలోని గ్రామాలతో సంబంధాలు తెగిపోయినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కౌతాళం మండల పరిధిలోని కుంబళనూరు–గోతులదొడ్డి గ్రామాల మధ్య ఉన్న వాగు వద్ద ఉన్న వంతెన ఏప్రిల్ నెలలో కూలిపోయినా ఇప్పటి వరకు శాశ్వత మరమ్మతులు చేయలేదు. తాత్కాలికంగా చేసిన పనులు ఈనెల మొదటి వారంలో కురిసిన భారీ వర్షానికి పూర్తిగా కొట్టుకుపోయాయి. దీంతో నదిచాగి, కుంబళనూరు క్యాంపు–1, క్యాంపు–2, కుంబళనూరు, మేళిగనూరు గ్రామాలతో పాటు కర్ణాటకలోని వివిధ గ్రామాల నుంచి హాల్వి గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి. ఆర్టీసీ సర్వీసులు కూడా నిలిచిపోవడంతో ఆయా గ్రామాల నుంచే వివిధ పనుల నిమిత్తం వచ్చే ప్రజలు, విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హాల్వి నుంచి కర్ణాటకలోని శిరుగుప్పకు వెళ్లేందుకు కూడా సౌకర్యాలు నిలిచిపోయాయి. వంతెన దెబ్బతిని రెండు నెలలు కావస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం కనీసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని ఆయా గ్రామాల ప్రజలు తెలిపారు. గొతులదొడ్డి, హాల్వి గ్రామాల రైతుల పొలాలకు కుంబళనూరు వైపు, కుంబళనూరు, క్యాంపు వాసుల పొలాలు హాల్వి, గొతులదొడ్డి వైపు ఉన్నాయి. బుధవారం అమావాస్య కావడంతో కర్ణాటకలోని మాన్వి, శిరుగుప్ప, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కర్ణాటకకు చెందిన ఒకరు రాత్రి కల్వర్టు గుర్తించక ద్విచక్ర వాహనంలో వచ్చి ఇక్కడ కింద పడి మృతి చెందాడు.
మరమ్మతుల కోసం రూ.40 లక్షలతో ప్రతిపాదనలు పంపాం. నిధులు విడుదలైన వెంటనే పనులు ప్రారంబిస్తాం. తాత్కలిక పనులు చేయడానికి ఎవరూ కూడ ముందుకు రావడం లేదు.
–ఆర్అండ్బీ–ఏఈ సాయిసురేష్
ప్రతిపాదనలు
పంపాం
కూలిన వంతెన మరమ్మతులు చేయని రాష్ట్ర ప్రభుత్వం

రాకపోక.. నరకయాతన

రాకపోక.. నరకయాతన