
వృద్ధ ఖైదీలకు ఉచిత న్యాయ సహాయం
నంద్యాల(వ్యవసాయం): అనారోగ్యంతో బాధపడుతున్న ఖైదీలకు, అలాగే 70 ఏళ్లు పైబడిన వృద్ధ ఖైదీలకు ఉచిత న్యాయ సహాయం అందిస్తామని జిల్లా ప్రధాన న్యాయమూర్తి కబర్ది, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ లీలా వెంకట శేషాద్రిలు తెలిపారు. నంద్యాలలోని జిల్లా ప్రత్యేక ఉపకారాగారాన్ని బుధవారం వారు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఖైదీలతో సమావేశం ఏర్పాటు చేశారు. లోక్ అదాలత్తో ఉచిత న్యాయం పొందవచ్చన్నారు. ఆన్లైన్ 15100 ద్వారా సేవలు అభ్యర్థించవచ్చని తెలిపారు. జైల్ సూపరింటెండెంట్ గురుప్రసాదరెడ్డి, న్యాయవాది నాయక్, లోక్ అదాలత్ సిబ్బంది పాల్గొన్నారు.