
ట్రాఫిక్ పీఎస్లకు అత్యాధునిక ద్విచక్ర వాహనాలు
కర్నూలు: ట్రాఫిక్ నియంత్రణకు అత్యాధునిక టెక్నాలజీతో రూపొందించిన 22 ద్విచక్ర వాహనాలను ఎస్పీ విక్రాంత్ పాటిల్ బుధవారం జెండా ఊపి ప్రారంభించారు. జిల్లాలోని కర్నూలు, ఆదోని, ఎమ్మిగనూరు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లకు ఈ వాహనాలను కేటాయించనున్నారు. నాలుగు చక్రాల వాహనాల్లో వెళ్లలేని ప్రాంతాల్లో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడినప్పుడు ఈ ద్విచక్ర వాహనాలపై అక్కడికి చేరుకుని ట్రాఫిక్ను క్రమబద్దీకరించే ఉద్దేశంతో పోలీసు చీఫ్ కార్యాలయం నుంచి ఈ వాహనాలను జిల్లాకు కేటాయించారని ఎస్పీ వెల్లడించారు. కార్యక్రమంలో హోంగార్డ్స్ సదరన్ రీజియన్ కమాండెంట్ మహేష్ కుమార్, ఏఆర్ అడిషనల్ ఎస్పీ కృష్ణమోహన్, డీఎస్పీలు బాబుప్రసాద్, భాస్కర్ రావు, ప్రసాద్, సీఐలు తేజమూర్తి, మన్సూరుద్దీన్, నాగరాజ రావు, రామయ్య నాయుడు తదితరులు పాల్గొన్నారు.