
కూటి కోసం పాము చేత పట్టి
కూటి కోసం కోటి విద్యలన్నారు పెద్దలు. కడుపు నింపుకోవడానికి వైఎస్సార్ జిల్లా కడపకు చెందిన వెంకటమ్మ అనే మహిళ కొండచిలువను మెడలో వేసుకుని భిక్షాటన చేస్తోంది. మండలంలోని పల్లెల్లో భిక్షాటన చేస్తూ కనిపించిన మహిళ పలు ఆసక్తికర విషయాలు చెప్పింది. గొంతుకు చుట్టుకుంటే ప్రాణానికే ప్రమాదం కదా అని ప్రశ్నిస్తే ప్రస్తుతం భిక్షాటన చేయాలంటే ఏదో ఒక కొత్తదనం ఉంటే తప్పా పైసలు ఇవ్వడం లేదని చెబుతోంది. పాముకు ఆహారంగా కోళ్ల వ్యర్థాలు, కప్పలు, ఎలుకలను వేస్తానని, కొండచిలువను చూసేందుకు వచ్చి ఒకొక్కరు రూ.10, రూ.5 ఇస్తున్నారని కోటివిద్యల్లో ఇదోకటి అంటూ నవ్వుతూ చెబుతోంది.
– దొర్నిపాడు