
వక్ఫ్ సవరణ చట్టంపై ముస్లింల నిరసన
ఎమ్మిగనూరుటౌన్:వక్ఫ్ సవరణ చట్టంపై శుక్రవారం ఎమ్మిగనూరులో ముస్లింలు నిరసన తెలిపారు.శివసర్కిల్లోని అబుబకర్ మసీదు లో ప్రార్థనల అనంతరం ముస్లింలు ఒక చోట చేరారు. వక్ఫ్ సవరణ చట్టాన్ని రద్దు చేయాలని, ముస్లింలకు న్యాయం చేయాలని నినాదా లు చేశారు. ముస్లింల మనోభావాలు దెబ్బతిసే లా వ్యవహరిస్తే ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. నిరసనలో మత పెద్దలు అతావుల్లా మౌలానా, మౌలానా మునీర్, పక్కీర్సాబ్, కౌన్సిలర్ వాహిద్, ముస్లింలు పాల్గొన్నారు.
విద్యార్థులకు ‘ఫీజు’ పాట్లు
కర్నూలు (టౌన్): ఫీజు రీయింబ్స్మెంట్ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం నీరుగారుస్తోందని వైఎస్సార్సీపీ విధ్యార్థి విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి కటికే గౌతమ్ ఆరోపించారు. రాష్ట్ర ప్రభు త్వం ఫీజులు విడుదల చేయకపోవడంతో విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారన్నారు. కర్నూలులోని ఎస్వీ కాంప్లెక్స్లో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో కూటమి ప్రభు త్వం అధికారంలోకి వచ్చి 10 నెలలు అవుతున్నా విద్యార్థులకు ఫీజు బకాయిలు అందడం లేదన్నా రు. రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ పట్టించుకోవడం లేదన్నారు. పెండింగ్లో ఉన్న బకా యిలు చెల్లించాలని, విధ్యార్థులను వేధిస్తున్న కళ శాలలపై చర్యలు తీసుకోవాలని కోరారు. త్వరలోనే విద్యార్థినీ, విధ్యార్థులకు, తల్లిదండ్రులకు మద్దతుగా ఉద్యమాల బాట పడతామన్నారు.
అగ్నిప్రమాదాలపై 101కు సమాచారం ఇవ్వాలి
కర్నూలు: అగ్నిప్రమాదాలు సంభవించినప్పు డు టోల్ఫ్రీ నంబర్ 101కు ఫోన్ చేసి సమాచా రం ఇవ్వాలని అగ్నిమాపక శాఖ జిల్లా సహాయ అధికారి వై.చిన్నబజారి సూచించారు. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా ఐదో రోజు శుక్రవారం కల్లూరు ఎస్టేట్లోని దామోదర్ ఆయిల్ మిల్, హిందుస్థాన్ పెట్రోల్ బంకుల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. అగ్నిప్రమాదాలు అరికట్టడానికి సరిపడే నీరు, ఇసుక అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. అగ్నిమాపక సిబ్బంది వెంకటరాముడు, హనుమంతు, నరసింహుడు, యు.రామాంజనేయులు, సి.రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

వక్ఫ్ సవరణ చట్టంపై ముస్లింల నిరసన

వక్ఫ్ సవరణ చట్టంపై ముస్లింల నిరసన