కర్నూలు(అగ్రికల్చర్): జిల్లాలో గురువారం సాయంత్రం నుంచి శుక్రవారం వరకు ఆరు మండలాల్లో వర్షం కురిసింది. హొళగొంద 48, ఆలూరులో 18.2, కౌతాళంలో 14.2, కోసిగిలో 12.6, ఓర్వకల్లులో 3.8, ఎమ్మిగనూరు మండలంలో 1.4 మి.మీ. ప్రకారం వర్షపాతం నమోదైంది. ఉరుములు, మెరుపులతో వర్షాలు పడే సమయంలో చెట్లు కింద, టవర్స్, పోల్స్ దగ్గర, బహిరంగ ప్రదేశాల్లో ఉండటం మంచిది కాదని బవనాసి కృషి విజ్ఞాన కేంద్రం వాతావరణ శాస్త్రవేత్త మహదేవయ్య తెలిపారు. కాగా.. జిల్లాలో ఉష్ణోగ్రతలు అదుపులోకి రావడం లేదు. ఇప్పటికీ 43–44 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి.